కృష్ణవంశీకి ‘మెగా’ సపోర్ట్‌

ఒకప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న కృష్ణవంశీ, ఈ మధ్యకాలంలో తన స్థాయికి తగ్గ చిత్రాలైతే చేయడంలేదన్నది నిర్వివాదాంశం. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో, ప్రస్తుతం 'నక్షత్రం' సినిమాపైనే కృష్ణవంశీ చాలా ఆశలు…

ఒకప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న కృష్ణవంశీ, ఈ మధ్యకాలంలో తన స్థాయికి తగ్గ చిత్రాలైతే చేయడంలేదన్నది నిర్వివాదాంశం. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో, ప్రస్తుతం 'నక్షత్రం' సినిమాపైనే కృష్ణవంశీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి హైప్‌ తెచ్చే క్రమంలో చాలా ఫీట్లు చేస్తున్నాడు కృష్ణవంశీ. 

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ మరో కీలక పాత్ర పోషించనున్న విషయం విదితమే. దానికి అదనంగా మెగా గ్లామర్‌ జోడించేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నాడట. అవేంటంటే, 'నక్షత్రం'కి మెగా కుటుంబంలో ఎవరో ఒకరితో (చిరంజీవి లేదా చరణ్‌) వాయిస్‌ ఓవర్‌ చెప్పించాలన్నది ఆయన ఆలోచన అట. ప్రస్తుతానికి ఇదింకా ప్రపోజల్‌ దశలోనే వున్నట్లు తెలుస్తోంది. ఏమో, కృష్ణవంశీ పట్ల వున్న అభిమానంతో చిరంజీవి కాకపోయినా చరణ్‌ అయినా ఈ సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

మరోపక్క, 'నక్షత్రం' చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ని రామ్‌చరణ్‌ విడుదల చేస్తాడు. అది కూడా సోషల్‌ మీడియాలో. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ ఎక్కువగా కన్పిస్తుంటుంది ఓ హీరో ఇంకో సినిమాకి ప్రమోషన్‌ చేయడానికి సోషల్‌ మీడియాలో పస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ వంటివి విడుదల చేయడం. ఎలాగైతేనేం, సినిమాకి హైప్‌ తీసుకొచ్చేందుకు కృష్ణవంశీ చేస్తున్న ప్రయత్నాల్ని అభినందించాల్సిందే.