కుర్రాడు కోటికి పాకేసాడు

రాజ్ తరుణ్..గట్టిగా రెండుమూడు హిట్ లు ఖాతాలో వున్నాయి. అంతే..కానీ చేతిలో వున్న ప్రాజెక్టులు అన్నీ కాస్త గట్టివే. నిన్న మొన్నటి దాకా పాతిక లక్షల్లో వున్న ఈ కుర్రాడు ఇప్పుడు మెల్లగా కోటికి…

రాజ్ తరుణ్..గట్టిగా రెండుమూడు హిట్ లు ఖాతాలో వున్నాయి. అంతే..కానీ చేతిలో వున్న ప్రాజెక్టులు అన్నీ కాస్త గట్టివే. నిన్న మొన్నటి దాకా పాతిక లక్షల్లో వున్న ఈ కుర్రాడు ఇప్పుడు మెల్లగా కోటికి పాకేస్తున్నాడు. గీతాఆర్ట్స్, సుకుమార్ సినిమా, సీనియర్ వంశీ ప్రాజెక్టు, ఇలా బిజీగా వున్నాడు. 

సినిమా చూపిస్తా మావా పది కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో అందరి దృష్టి ఈ కుర్రాడిపై పడింది. ఇప్పుడు అడ్వాన్స్ లు ఇస్తామంటూ వెంటపడుతున్నారు. దాంతో రేటు వాళ్లే పెంచేస్తున్నారు. కుర్రాడితో మూడు నాలుగు కోట్లలో సినిమా కానిస్తే, పది కోట్లు కొట్టేయచ్చేమో అనుకుంటున్నారు. అందుకే యాభై అరవై ఏమంత పెద్ద అమౌంట్ కాదనుకుంటున్నారు. గతంలో వరుణ్ సందేశ్ కు కూడా యాభై కంటిన్యూగా ఇచ్చిన రోజులు వున్నాయి. 

దాంతొ రాజ్ తరుణ్ రేటు కూడా ఇప్పుడు యాభై, అరవై, అంటూ పెరిగింది. కోటికి చేరడానికి మరో వారం మాత్రమే టైమ్ వుంది. ఎందుకంటే వారంలో రాజ్ తరుణ్ నటించిన కుమారి 21 ఎఫ్ సినిమా విడుదల అవుతుంది. అది కానీ విజయం సాధిస్తే, కుర్రాడు కోటికి పాకేస్తాడు.