Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కృష్ణానదీ తీరంలో మహర్షి ఫంక్షన్

కృష్ణానదీ తీరంలో మహర్షి ఫంక్షన్

మహర్షి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారీ సభ ఒకటి జరపాలని సినిమా విడుదలకు ముందే అనుకున్న సంగతి, దానిని ముందే గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫంక్షన్ పై మరిన్ని అప్ డేట్స్. ఫంక్షన్ ను విజయవాడ కృష్ణానదీ తీరంలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి అనుమతి కోసం లెటర్ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఏ కారణం చేత అయినా అనుమతి రాకపోతే, లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో చేయలని ప్లాన్ చేస్తున్నారు. విశాలమైన పిడబ్ల్యుడి గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ ఒకటి నడుస్తోంది. అందువల్లే ఈ రెండు వెన్యూలు డిసైడ్ చేసారు. అలాగే ఈ ఫంక్షన్ కు ముందే అనుకున్నట్లు మహేష్ తో సినిమాలు చేసిన 25 మంది నిర్మాతలను, 25 మంది దర్శకులను ఆహ్వానిస్తారు.

అదికాక సినిమా రంగంలోని ప్రముఖులు అనేక మందిని ఆహ్వానిస్తారు. ఆరోగ్యం సహకరిస్తే మహేష్ బాబు తండ్రి కృష్ణ కూడా వస్తారు. ఈ కార్యక్రమంలో వైవిధ్యమైన అడియో వీడియో ప్రెజెంటేషన్లు కొన్ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?