మహేశ్ సినిమాలు పట్టాలెక్కే వరకూ నమ్మలేనివే!

మహేశ్ బాబు తదుపరి పాజెక్టు ఫలానా దర్శకుడితో అనే పకటన వచ్చినప్పుడు.. అది చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఆ పాజెక్టు కచ్చితంగా పట్టాలెక్కుతుందని మాత్రం నమ్మకం పెట్టుకోలేం! ప్రత్యేకించి గతకొన్ని సంవత్సరాలుగా మహేశ్…

మహేశ్ బాబు తదుపరి పాజెక్టు ఫలానా దర్శకుడితో అనే పకటన వచ్చినప్పుడు.. అది చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఆ పాజెక్టు కచ్చితంగా పట్టాలెక్కుతుందని మాత్రం నమ్మకం పెట్టుకోలేం! ప్రత్యేకించి గతకొన్ని సంవత్సరాలుగా మహేశ్ బాబు ప్రకటిత ప్రాజెక్టులు గల్లంతయిపోవడాన్ని గమనించవచ్చు. ప్లాన్డ్‌గా ముందుకు వెళ్లకపోవడాన్నీ గుర్తించవచ్చు.

అప్పుడెప్పుడు మణిరత్నంతో సినిమా అని ప్రకటించాడు మహేశ్ . ట్విటర్ ద్వారా ఆ ఎగ్జయిట్‌మెంట్‌ను ఆయన షేర్ చేసుకొన్నారు. మణితో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇస్తోందని మహేశ్ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఆ పాజెక్టు గల్లంతయ్యింది. ఆ తర్వాత కూడా మరోసారి మహేశ్ – నాగార్జున- మణిరత్నం కాంబోలో సినిమా అన్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని ధృవీకరణలు జరిగాయి. అయితే అదీ గల్లంతయ్యింది. 

ఇక మహేశ్, తివికమ్ కాంబోలో సినిమా చాలా రోజుల నుంచి ప్రతిపాదనలో ఉంది. అది ఎప్పటికి పట్టాలెక్కుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే అనూహ్యంగా మహేశ్ ‘శీమంతుడు’ పూర్తి చేశాడు. చరణ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్న కొరటాల శివతో మహేశ్ చకచకా సినిమా పూర్తి చేశాడు. ఇలాగే ప్లాన్‌లో లేకుండానే ‘బ్రహ్మోత్సవం’ ఖరారు అయ్యింది. ఇలా మహేశ్ కెరీర్ అన్‌ప్లాన్డ్‌గా సాగుతోంది.

ఇక ఇటీవల దర్శకుడు పూరీ జగన్నాథ్ మహేశ్‌తో సినిమాను ప్రకటించాడు. ప్రస్తుతం మహేశ్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాగానే.. పూరీతో సినిమా అని వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఇప్పుడు మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో సినిమా అనే వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు పూరీ సినిమా ఏమైనట్టు? అది తెరకెక్కుతుందా లేక ప్రకటనతోనే ఆగిపోతుందా? అనేవి సందేహాలు! 

అలాగే రాజమౌళితో మహేశ్ చేయబోతున్నాడనే సినిమా కూడా పట్టాలెక్కే వరకూ కూడా నమ్మకం లేనిదనే అనుకోవాలి. ఎందుకంటే.. గతంలో కూడా ఒకసారి మహేశ్ – రాజమౌళి సినిమా చర్చలోకి వచ్చింది. అప్పట్లో సబ్జెక్టు గురించి రాజమౌళి మహేశ్ ఫ్యాన్స్‌తో చర్చించాడు కూడా. మరి ఇప్పుడైనా ఈ కాంబో తెరకెక్కుతుందేమో చూడాలి!