మహేష్ మరో మైలురాయి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మైలు రాయి చేరుకున్నాడు. 'ఫోర్బ్స్ ఇండియా' లేటెస్ట్ టాప్ 100 మంది సెలబ్రిటీల లిస్ట్ లో మహేష్ 30వ స్థానంలో నిలిచాడు. అయితే మన సెలబ్రిటీల…

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మైలు రాయి చేరుకున్నాడు. 'ఫోర్బ్స్ ఇండియా' లేటెస్ట్ టాప్ 100 మంది సెలబ్రిటీల లిస్ట్ లో మహేష్ 30వ స్థానంలో నిలిచాడు. అయితే మన సెలబ్రిటీల లెక్కలు తీస్తే మాత్రం నంబర్ వన్ స్థానం మహేష్ దే. ఈ ఏడాది మహేష్ ఆదాయం 51 కోట్ల రూపాయలు కావడంతో ఈ ప్లేస్ దక్కింది. 

ఈ మేరకు ఫోర్బ్స్ ఇండియా పత్రిక డిసైడ్ చేసింది. అసలు ఈ జాబితా టాప్ టెన్ లో ముగ్గరు మినహా అందరూ సినిమా వారే. ఆ ముగ్గురూ క్రికెటర్లు.  సంపాదన విషయంలో మహేష్ 14వ ర్యాంక్ లో నిలచాడు.  

మహేష్ తర్వాత పవన్ కళ్యాణ్ 38వ స్థానంలో, అల్లు అర్జున్ 54వ స్థానంలో ఉన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ 16 కోట్ల రూపాయలు, అల్లు అర్జున్ 11.5 కోట్ల సంపాదించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.