Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ మైండ్ మారిందా?

మహేష్ మైండ్ మారిందా?

కొరటాల శివతో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న శ్రీమంతుడు పూర్తి కావస్తొంది.. తరువాతి ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు..పివిపి సంస్థ, అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందించే బ్రహ్మోత్సవం ప్రాజెక్టుకు ఒకె చెప్పాడు. అయితే ఇప్పుడు మహేష్ మనసు మార్చుకున్నట్లు వినిపిస్తోంది. 

ప్రాజెక్టు ఓకె కానీ శ్రీమంతుడు తరువాత కాకుండా, కాస్త గ్యాప్ తీసుకుని చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికీ లాజిక్ వుంది. శ్రీమంతుడు..బ్రహ్మోత్సవం సినిమాలు రెండూ మరీ పూర్తి మాస్ కాదు..కాస్త క్లాస్ టచ్ కూడా వున్న సినిమాలు. అందుకే పోకిరి లాంటి ఫుల్ మాస్ సినిమా ఒకటి మధ్యలో చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

శ్రీమంతుడు తరువాత ఓ పుల్ మాస్ సినిమా చేసి, ఆ తరువాత శ్రీకాంత్-పివిపి సినిమా మీదకు వెళ్తాడని వినిపిస్తోంది. అయితే మాస్ సినిమా అంటే మరి ఏ డైరక్టర్ రెడీ గా వున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఖాళీ అవుతున్నారు. ఆయనతో కానీ, లేదా క్రేజీ డైరక్టర్ పూరి తో కానీ సినిమా చేసే అవకాశం వుందేమో?​

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?