మహేష్ మల్టీ ఫ్లెక్స్ ఓపెనింగ్ వాయిదా?

హైదరాబాద్ కొండాపూర్ లో మహేష్ బాబు, ఏషియన్ సునీల్ కలిసి నిర్మించిన ఎఎమ్బీ మాల్ ప్రారంభోత్సవం ఈనెల 29న అని ఇప్పటి వరకు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ అది డిసెంబర్ 2కు వాయిదాపడే…

హైదరాబాద్ కొండాపూర్ లో మహేష్ బాబు, ఏషియన్ సునీల్ కలిసి నిర్మించిన ఎఎమ్బీ మాల్ ప్రారంభోత్సవం ఈనెల 29న అని ఇప్పటి వరకు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ అది డిసెంబర్ 2కు వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఫినిషింగ్ పనులు పూర్తికాకపోవడం, అనుమతులు కొన్ని ఇంకా రావాల్సి వుండడం వంటివి కారణాలుగా తెలుస్తోంది.

ఇంకా కొన్ని కొన్ని సీటింగ్ లు బిగించాల్సి వుంది. ఫ్లోరింగ్ మీద, చాలాచోట్ల వున్న కవరింగ్ ప్లాస్టిక్స్ తొలగించాల్సి వుంది. అలాగే చాలాచోట్ల మిర్రర్ వర్క్ కొంచెం బ్యాలెన్స్ వుంది. ఇవన్నీ రాత్రి పవళ్లు కలిసి వర్క్ చేస్తూ, ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంక మధ్యలో ఒక్కరోజే మిగిలింది. అందువల్ల 29కి ప్రారంభం కాకపోవచ్చని తెలుస్తోంది. ఇదిలావుంటే ఇప్పటివరకు చలామణీలో వున్న మల్టీ ఫ్లెక్స్ ఫొటోలు ఏవీ ఒరిజినల్ కావని తెలుస్తోంది. నిర్మాణం కోసం ఆర్కిటెక్ట్ లు తయారుచేసిన త్రీడీ ఫొటోలనే, మల్టీ ఫ్లెక్స్ ఫొటోలుగా చలామణీ చేస్తున్నారని తెలుస్తోంది.

ఒరిజినల్ ఫొటోలు రావడానికి మరికొన్ని రోజులు పడుతుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే 29న ఓపెనింగ్ అయితే రోబో సినిమా ప్రారంభ చిత్రంగా వుంటుందని వినిపించింది. మరి డిసెంబర్ 2న అయితే ఏ సినిమా వుంటుందో తెలియాల్సి వుంది.

కల్యాణ్ రామ్ ఇంతకీ ఎటువైపు..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్