Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్-త్రివిక్రమ్ సినిమా లేనట్లేనా?

మహేష్-త్రివిక్రమ్ సినిమా లేనట్లేనా?

మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎప్పటి నుంచో డ్యూ వుంది. వాస్తవానికి వంశీ పైడిపల్లి సినిమా తరువాత ఆ సినిమానే వుంటుందని అనుకున్నారు అంతా. కానీ అనుకోకుండా సుకుమార్ సినిమా వచ్చి చేరింది. చిత్రమేమిటంటే, సుకుమార్ – మహేష్ సినిమా నిర్మించే మైత్రీ మూవీస్ నే తివిక్రమ్-మహేష్ సినిమా నిర్మించాల్సి వుంది. త్రివిక్రమ్ దగ్గర ఎప్పటి నుంచో మైత్రీ అడ్వాన్స్ వుంది. అది కూడా మహేష్ తో సినిమాకు అనే క్లియర్ గా వుంది.

అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు లేనట్లే అనుకోవాలి. ఎందుకంటే వంశీ పైడిపల్లి, సుకుమార్ ఫిక్స్ అయిపోగా, అర్జున్ రెడ్డి డైరక్టర్ కూడా మహేష్ తో పాటు తరచు కనిపిస్తున్నారు. మరి మైత్రీ మూవీస్ మనిషిగా కనిపిస్తున్నారా? లేక మహేష్ తో సినిమా పైప్ లైన్ లో వున్నందున కనిపిస్తున్నారా? అన్నది తెలియాల్సి వుంది.

త్రివిక్రమ్ తో సినిమా చేసే ఇంట్రస్ట్ మహేష్ తో వుందా? అన్నది అనుమానం. గతంలో హారిక హాసిని సంస్థకు మహేష్ సినిమా చేయాల్సి వుంది. కానీ మహేష్ సినిమా లేట్ అవుతూ వుండడంతో, వాళ్లు వచ్చి అడ్వాన్స్ అడిగి మరీ వెనక్కు తీసుకెళ్లిపోయారు. అందువల్ల ఆ బ్యానర్ కు మహేష్ మరి సినిమా చేసే అవకాశం లేనట్లే.

త్రివిక్రమ్ తన సినిమాలు అన్నీ హారిక హాసినికే చేస్తున్నారు. మైత్రీ అడ్వాన్స్ వున్నా, మరి మహేష్ కు ఆసక్తి వున్నట్లు కనిపించడం లేదు. దీని వెనుక హారిక హాసిని అడ్వాన్స్ వెనక్కు తీసుకోవడం అన్న విషయం ఎక్కడో వున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పైగా ఇకపై మహేష్ కు త్రివిక్రమ్ తో సినిమా చేయాలన్న ఆలోచన రావాలంటే ఎన్టీఆర్ తో చేసే సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. అప్పుడు మహేష్ మనసు మారవచ్చు. ఎందుకంటే హిట్ డైరక్టర్లేగా కావాలి. అందువల్ల 2019లోపు అయితే త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ వుండకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?