Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా మల్టీస్టారర్ లో మార్పుచేర్పులు?

మెగా మల్టీస్టారర్ లో మార్పుచేర్పులు?

చిరంజీవి, పవన్ కల్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టు ఎనౌన్స్ చేశారు సుబ్బరామిరెడ్డి. ఆ ప్రాజెక్టు రాదనే విషయం తెలిసి కూడా తన స్టేట్ మెంట్ లో ఎలాంటి మార్పు చేయలేదు. మూవీ కచ్చితంగా వస్తుందని, చిరంజీవితో కూడా మాట్లాడానని చెప్పుకొచ్చారు. అలా కొన్ని నెలలుగా ఇదే మాట వినిపిస్తున్న సుబ్బరామిరెడ్డి, ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై కాస్త తగ్గారు.

చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో కచ్చితంగా సినిమా ఉంటుందంటున్న సుబ్బరామిరెడ్డి, ఇప్పుడు కాస్త తగ్గి చిరంజీవితో ఓ సినిమా చేస్తానని, అందులో పవన్ కల్యాణ్ కూడా నటిస్తాడని చెబుతున్నారు. అంటే దీనర్థం.. పేరుకు ఇది మల్టీస్టారర్ అయినప్పటికీ.. ఫుల్ లెంగ్త్ రోల్ మాత్రం చిరంజీవిదన్నమాట. పవన్ కల్యాణ్ గెస్ట్ రోల్ లో ఇలా వచ్చి అలా వెళ్తాడని అనుకోవచ్చు.

మొన్నటివరకు మల్టీస్టారర్ అనుకున్న సినిమా ఇప్పుడిలా సింగిల్ స్టార్ మూవీగా మారబోతోందన్నమాట. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు డౌటే. ఎందుకంటే, ప్రస్తుతానికి పవన్ కు సినిమాలపై దృష్టి లేదు. మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తాడో తెలీదు. అటు చిరంజీవికి కూడా చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఈ లోగా ఈ మల్టీస్టారర్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?