Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మ‌రో మ‌ల్టీస్టార‌ర్ షురూ?!

మ‌రో మ‌ల్టీస్టార‌ర్ షురూ?!

నాగార్జున‌, ఎన్టీఆర్ క‌లిసి ఓ చిత్రంలో న‌టించ‌బోతున్నార‌న్న వార్త ఎప్పట్నుంచో వినిపిస్తోంది. `ఎవ‌డు`తో విజ‌యాన్ని అందుకొన్న వంశీ పైడిప‌ల్లి ఆ ఇద్దరినీ దృష్టిలో ఉంచుకొని ఓ  క‌థ‌ని సిద్ధం చేశారు. రెండు నెల‌ల క్రిత‌మే ఇద్దరికీ క‌థ వినిపించాడు. నాగార్జున ఒప్పుకొన్నా... ఎన్టీఆర్ మాత్రం ఏ విష‌యం చెప్పలేద‌ట‌. 

దీంతో ఆ కాంబినేష‌న్‌లో సినిమా ఉండ‌క‌పోవ‌చ్చనే ప్రచారం సాగింది. కానీ ఇటీవ‌ల ఎన్టీఆర్... వంశీ పైడిప‌ల్లిని పిలిచి పూర్తిస్థాయిలో స్క్రిప్టు ప‌నులు మొద‌లుపెట్టమ‌ని చెప్పాడ‌ట‌. దీంతో ఈ చిత్రం ప‌నులు షురూ అయిన‌ట్టు స‌మాచారం. మేలో కానీ జూన్‌లో కానీ సినిమాకి కొబ్బరికాయ కొట్టొచ్చని తెలుస్తోంది. 

దిల్‌రాజు సంస్థలోనే ఆ చిత్రం తెర‌కెక్కే అవ‌కాశాలున్నట్టు తెలుస్తోంది. నంద‌మూరి, అక్కినేని క‌థానాయ‌కులు క‌లిసి న‌టిస్తున్నారంటే అంచ‌నాలు భారీగా ఉంటాయి. అందుకు త‌గ్గట్టుగానే సినిమా ఉండాల‌ని నాగార్జున‌, ఎన్టీఆర్ సూచించిన‌ట్టు స‌మాచారం.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?