చ‌ర‌ణ్ మ‌ళ్లీ మాటిచ్చాడ‌ట‌!

మిర్చి ద‌ర్శకుడు కొర‌టాల శివ‌కి రామ్‌చ‌ర‌ణ్ మ‌ళ్లీ మాటిచ్చాడ‌ట‌. ఈసారి త‌ప్పకుండా క‌లిసి సినిమా చేద్దామ‌ని చెప్పాడ‌ట‌. వాస్తవానికి `గోవిందుడు అంద‌రివాడేలే` ప్లేస్‌లో కొర‌టాల శివనే సినిమా చేయాలి. సుమారు ఐదారు నెల‌లు ఆ…

మిర్చి ద‌ర్శకుడు కొర‌టాల శివ‌కి రామ్‌చ‌ర‌ణ్ మ‌ళ్లీ మాటిచ్చాడ‌ట‌. ఈసారి త‌ప్పకుండా క‌లిసి సినిమా చేద్దామ‌ని చెప్పాడ‌ట‌. వాస్తవానికి `గోవిందుడు అంద‌రివాడేలే` ప్లేస్‌లో కొర‌టాల శివనే సినిమా చేయాలి. సుమారు ఐదారు నెల‌లు ఆ సినిమా గురించి చ‌ర్చలు కూడా జ‌రిగాయి. అయితే.. ఏమైందో తెలియ‌దు కానీ ఆ ప్రాజెక్టు వ‌ర్కవుట్ అవ్వలేదు. 

అందుకు ర‌క‌ర‌కాల కార‌ణాలున్నాయ‌ని ఇండ‌స్ట్రీలో ప్రచారం సాగుతోంది. అర్ధంత‌రంగా ఆ ప్రాజెక్టు ఆగిపోవ‌డంతో… చ‌ర‌ణ్ కృష్ణవంశీ ద‌ర్శత‌కత్వంలోనూ, కొర‌టాల శివ…  మ‌హేష్‌తోనూ సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేసుకొన్నారు. యుటీవీ సంస్థ నిర్మించ‌నున్న మ‌హేష్  సినిమాకి త్వర‌లోనే  కొబ్బరికాయ కొట్టబోతున్నారు. 

అయితే… ఇటీవ‌ల మ‌ళ్లీ చ‌ర‌ణ్‌-కొరటాల శివ క‌లుసుకొన్నార‌ట‌. త‌మ త‌మ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకొన్నార‌ట‌. ఈసారి మాత్రం త‌ప్పకుండా నీతో సినిమా చేస్తాన‌ని చ‌ర‌ణ్… కొర‌టాల శివ‌కి మాటిచ్చాడ‌ట‌. బ‌హుశా మ‌హేష్‌తో సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్‌తోనే కొర‌టాల శివ ప‌నిచేస్తాడేమో అంటున్నాయి ప‌రిశ్రమ వ‌ర్గాలు.