Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మారుతి కొత్త చిత్రం ప్రారంభం

మారుతి కొత్త చిత్రం ప్రారంభం

శైలజారెడ్డి అల్లుడు సినిమా తరువాత దర్శకుడు మారుతి చేయబోతున్న చిత్రం ''ప్రతి రోజూ పండుగే''. చిత్రలహరి సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని ఫిలింనగర్ టెంపుల్ లో ఈరోజు ప్రారంభిస్తున్నారు.

రాశీ ఖన్నా హీరోయిన్. సుప్రీమ్ సినిమాలో నటించిన ఈ సక్సెస్ ఫుల్ జంట మరోసారి ఈ సినిమాలో కనిపించబోతోంది.

అల్లు అరవింద్, దిల్ రాజు, సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా, బన్నీవాస్ లాంటి వారంతా ఓపెనింగ్ ఫంక్షన్ కు హాజరవుతున్నారు.

సినిమాను అల్లు అరవింద్, యువి వంశీ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గతంలో ఇదే భాగస్వామ్యంలో భలే భలేమగాడివోయ్ లాంటి హిట్ సినిమాను నిర్మించారు.

అటు హిట్ నిర్మాణ భాగస్వామ్యం, ఇటు హిట్ పెయిర్, అన్నీ కలిసి సినిమాకు శుభసూచకంగా వున్నాయి. మారుతి డైరక్షన్ లో ఫ్యామిలీ జోనర్ లో పూర్తి ఫీల్ గుడ్ జోనర్ లో ''ప్రతి రోజూ పండగే' రెడీ కాబోతోంది.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?