Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్‌ని పూరి 'టచ్‌' చేస్తున్నాడా.?

మెగాస్టార్‌ని పూరి 'టచ్‌' చేస్తున్నాడా.?

అన్నీ అనుకున్నట్లుగానే జరిగి వుంటే పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ఈపాటికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే. చిరంజీవి హ్యాండివ్వడంతో ఈలోగా పూరి జగన్నాథ్‌, 'లోఫర్‌' సినిమాని పూర్తి చేసేసి, ఇంకో సినిమాని సెట్స్‌ మీదకు ఎక్కించేశాడు కూడా. పూరి సినిమాల్లో 'వేగం' అలా వుంటుంది మరి.! 

అసలు, పూరి డైరెక్షన్‌లో చిరంజీవి సినిమా అన్న ఆలోచనే ఎవరికీ రాలేదు అంతకు ముందు వరకూ. కానీ, కాంబినేషన్‌ కుదిరినట్లే పరిస్థితులు కన్పించాయి. కథ దగ్గరకొచ్చేసరికి తేడాలొచ్చేశాయి. కథ విషయంలోనే చిరంజీవి - రామ్‌చరణ్‌లతో పూరి జగన్నాథ్‌కి సమస్య వచ్చిపడింది. అలా ఆ సినిమా అటకెక్కేసింది. పూరి అప్పట్లో బాగా హర్టయ్యాడు కూడా. పవన్‌కళ్యాణ్‌ని పూరి ఎంతలా అభిమానిస్తాడో, చిరంజీవినీ అంతే. 

అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడిక పూరి 'ఇజం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నాడు. 'ఇజం' అనగానే పవన్‌ అభిమానులకు 'పవనిజం' గుర్తుకొచ్చేసి, వారిలో కాస్త అలజడి బయల్దేరిన మాట వాస్తవం. ఏమో, పూరి ఎలాంటి సెటైర్లు పవన్‌ మీద వేస్తాడోనన్నది వారి ఆందోళనకు కారణం కావొచ్చుగాక. అదే సమయంలో తాజాగా ఫిలిం సర్కిల్స్‌లో విన్పిస్తున్న గాసిప్స్‌ని బట్టి చూస్తే, చిరంజీవినీ పూరి 'ఇజం'లో టచ్‌ చేయనున్నాడట. అదే గనుక నిజమైతే ఇంకేమన్నా వుందా.? 

అన్నట్టు, 'ఇజం' సినిమాలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాని కళ్యాణ్‌రామ్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?