మెగాస్టార్ రిటర్న్

మెగాస్టార్ చిరంజీవి వచ్చేసారు. విశాఖ పేమ బే పార్ట్ ఆయుర్వేదిక రిసార్ట్ లో కొన్నిరోజుల పాటు శరీరాకృతి చికిత్స తీసుకున్న తరువాత మెగాస్టార్ శనివారం రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల…

మెగాస్టార్ చిరంజీవి వచ్చేసారు. విశాఖ పేమ బే పార్ట్ ఆయుర్వేదిక రిసార్ట్ లో కొన్నిరోజుల పాటు శరీరాకృతి చికిత్స తీసుకున్న తరువాత మెగాస్టార్ శనివారం రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ జనాలకు విశాఖలోని బే పార్క్ ఓ ఆకర్షణగా మారినట్లు తెలుస్తోంది. బీచ్ రోడ్ లోని ఓ మిట్ట మీద అత్యంత విలాసంగా నిర్మించి ఆయర్వేదిక్ రిసార్ట్ ఇది.

సైరా సినిమా షూట్ పూర్తి చేసుకుని, కొరటాల శివ సినిమా మీదకు వెళ్లాల్సివుంది మెగాస్టార్ చిరంజీవి. అందుకోసం కొంచెం మేకోవర్, కాస్త సన్నబడే కార్యక్రమం అవసరం వుంది. అందుకే ఆయన విశాఖలోని బే లీఫ్ లో చేరి, వారంరోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే అదే సమయంలో నిర్మాత దిల్ రాజు కూడా అదే బే పార్క్ లో చికిత్స తీసుకున్నారు. ఆయన చిరకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దానికి చికిత్స కోసం ఆయన కూడా అక్కడే చేరి వారం రోజులు ట్రీట్ మెంట్ తీసుకుని వచ్చారు.

వాస్తవానికి దిల్ రాజు ముందే వచ్చేయాల్సి వుంది. కానీ మెగాస్టార్ కోరిక మేరకు, ఆయనకు తోడుగా మరి కొన్నిరోజులు అక్కడ వుండి, ఆయనతోనే కలిసి వెనక్కు వచ్చినట్లు తెలుస్తోంది.

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది