నితిన్ కోసం రామ్ కు హ్యాండ్ ఇచ్చేసింది

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ కు హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హాజరయ్యారు. రామ్ వాళ్లతో సెల్ఫీ కూడా దిగాడు. ఇదంతా…

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ కు హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హాజరయ్యారు. రామ్ వాళ్లతో సెల్ఫీ కూడా దిగాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఇప్పుడా ప్రాజెక్టు నుంచి మేఘా ఆకాష్ తప్పుకుంది. 

“లై సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. మళ్లీ నితిన్ తోనే ఇంకో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాను. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాను. అందుకే రామ్ సినిమా నుంచి తప్పుకున్నాను” రామ్ సినిమాపై మేఘా ఆకాష్ క్లారిటీ ఇది.

కథ ప్రకారం రామ్ సినిమాకు 20రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. కానీ అదే టైమ్ కు లై సినిమా యూనిట్ ఏకంగా 75రోజుల పాటు అమెరికా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. దీంతో రామ్ కు హ్యాండ్ ఇవ్వక తప్పలేదంటోంది మేఘా ఆకాష్.

కానీ తాజా సమాచారం ప్రకారం రామ్ సినిమాలో మేఘా ఆకాష్ ది సెకెండ్ హీరోయిన్ రోల్. మొదటి హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ సెలక్ట్ చేశారు. అందుకే ఆ ప్రాజెక్టు నుంచి మేఘా తప్పుకుందని తెలుస్తోంది. ఆమె స్థానంలో లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని అనుకుంటున్నారు.