ముగ్గురు నిర్మాతల నడుమ శివ

టాలెంట్ ఎక్కడ వుందో చూసి, రుమాలు వేసేయడం మన టాలీవుడ్ నిర్మాతలకు బాగా తెలుసు. పోతే పోయిందని, అడ్వాన్స్ చేతిలో పెట్టేస్తారు. దర్శకులు కూడా వచ్చిన అడ్వాన్స్ అల్లా తీసుకుంటారు. Advertisement కానీ సక్సెస్…

టాలెంట్ ఎక్కడ వుందో చూసి, రుమాలు వేసేయడం మన టాలీవుడ్ నిర్మాతలకు బాగా తెలుసు. పోతే పోయిందని, అడ్వాన్స్ చేతిలో పెట్టేస్తారు. దర్శకులు కూడా వచ్చిన అడ్వాన్స్ అల్లా తీసుకుంటారు.

కానీ సక్సెస్ వచ్చిన తరువాత సినిమాలు చేయడానికే సమస్య అవుతుంది. ఇప్పుడు కొరటాల శివ సమస్య అలాంటిదే. ఆయన దగ్గర చాలా అడ్వాన్స్ లు వున్నాయని వినికిడి. మిర్చి విడుదల కాగానే డివివి దానయ్య అడ్వాన్స్ చేతిలో పెట్టేసారు.

మిర్చి విడుదలకు ముందు బండ్ల గణేష్ తన అడ్వాన్స్ చేతిలో పెట్టారు. ఇప్పుడు మైత్రీ మూవీస్ అనుబంధం ఎలాగూ వుంది. సరే, శ్రీమంతుడు సక్సెస్ తరువాత కొరటాల శివ ఏ హీరోతో సినిమా చేస్తారన్నది ఎంత కీలకంగా మారిందో, ఏ నిర్మాతకు అన్నది కూడా అంతే క్వశ్చనుగా మారింది.

మైత్రీ మూవీస్ కు ఎన్టీఆర్ దగ్గర అడ్వాన్స్ వుంది. అందుకని, మళ్లీ శ్రీమంతుడు టీమ్ అలా వెళ్తుందని ఓ మాట. డివివి దానయ్య ఎలాగైనా బన్నీ-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా చేయాలని పట్టుదలగా వున్నారని మరో టాక్. మూడో సినిమా తనదే కావాలని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.

ఇక అందరికన్నా ముందు తను అడ్వాన్స్ ఇచ్చానని, తనకు సినిమా చేయాల్సిందే అని బండ్ల గణేష్ అంటున్నాడట. మరి ఏ నిర్మాతతో, ఏ హీరోతో చేస్తాడో కొరటాల..చూడాలి.