ముక్కలు ముక్కలుగా సినిమా మొత్తం..!

సినిమాకు ప్రచారం కల్పించడం కోసం బాలీవుడ్ మేకర్స్ ఎన్ని ఎత్తులైనా వేస్తారు. హీరోహీరోయిన్ల మధ్య ఏదో ఉన్నట్టు పుకార్లు సృష్టిస్తుంటారు. మరికొన్నిసార్లు వివాదాలు రేపుతుంటారు. ఇంకొందరేమో దశలవారీగా సాంగ్స్ రిలీజ్ చేస్తుంటారు. స్టార్ ప్రొడ్యూసర్…

సినిమాకు ప్రచారం కల్పించడం కోసం బాలీవుడ్ మేకర్స్ ఎన్ని ఎత్తులైనా వేస్తారు. హీరోహీరోయిన్ల మధ్య ఏదో ఉన్నట్టు పుకార్లు సృష్టిస్తుంటారు. మరికొన్నిసార్లు వివాదాలు రేపుతుంటారు. ఇంకొందరేమో దశలవారీగా సాంగ్స్ రిలీజ్ చేస్తుంటారు. స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఈసారి మరో ఎత్తుగడతో ముందుకొచ్చాడు. 

ఆయుష్మాన్ ఖురానా, పరిణీతి చోప్రా హీరోహీరోయిన్లుగా “మేరీ ప్యారీ బిందు” అనే సినిమాను నిర్మించాడు ఆదిత్య చోప్రా. ఈ సినిమా ప్రమోషన్ ను కొత్తగా చేద్దామని ప్లాన్ చేసిన సదరు నిర్మాత… బిట్లు బిట్లుగా సినిమాలో చాలా భాగాన్ని యూబ్యూబ్ లో పెట్టడం చేయడం స్టార్ట్ చేశాడు. అఫీషియల్ ట్రయిలర్స్ అని చెప్పి… చాప్టర్-1, చాప్టర్-2 అంటూ ఇప్పటికే 5 వీడియోలు రిలీజ్ చేశాడు. వీటి నిడివి ఎంత వద్దనుకున్నా.. 7-8 నిమిషాలు ఉంది. 

మరికొన్ని రోజుల్లో సినిమాలో సాంగ్స్ అన్నింటినీ బిట్లు బిట్లుగా విడుదల చేయబోతున్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత విడుదలకు సరిగ్గా ముందు రోజు కీలకమైన మరో సన్నివేశాన్ని విడుదల చేస్తాడట. మొత్తంగా చూసుకుంటే రిలీజ్ టైమ్ కు దాదాపు 20 నిమిషాల క్లిప్పింగ్ లు పోగయ్యే అవకాశముంది. దీని వల్ల సినిమాకు మంచి ప్రచారం వస్తుందని ఆదిత్య చోప్రా భావిస్తున్నాడు. అయితే బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం దీని వల్ల సినిమాపై హైప్ తగ్గిపోతుందని వాదిస్తున్నారు. నిర్మాత ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేక క్రిటిక్స్ మాట నిజమౌతుందో తెలియాలంటే వచ్చేనెల 12 వరకు ఆగాల్సిందే.