Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మైత్రీకి ఎందుకీ తహతహ

మైత్రీకి ఎందుకీ తహతహ

శ్రీమంతుడు చేసారు..ఆపై జనతా గ్యారేజ్ చేసారు. ఇప్పుడు చరణ్ తో సుకుమార్ డైరక్షన్ లో సినిమాకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మళ్లీ మరోసారి త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో సినిమా వీళ్లకే వుంది. మరి ఇప్పుడు ఈలోగానే ఎన్టీఆర్ - తివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేసేయాలని మైత్రీ అధినేతలు కాస్త ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ ఎప్పుడైతే జనతా గ్యారేజ్ తరువాత డైరక్టర్ దొరక్క ఖాళీగా వున్నారో, త్రివిక్రమ్ అ..ఆ తరువాత పవన్ టైమ్ కోసం వెయిట్ చేయడం గమనించారో, అప్పటి నుంచి మైత్రీ జనాలు ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి తెరవెనుక పావులు కదుపుతున్నారు. కానీ త్రివిక్రమ్ వైపు నుంచి స్పందన కనిపించడం లేదు. 

అయితే సీన్ లో ఎక్కడా మైత్రీ వాళ్లు నేరుగా కనిపించడం లేదు. కానీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై వస్తున్న ఫీలర్లు అన్నీ మాత్రం ఆ సంస్థకు అనుకూలంగా వుంటున్నాయి. ఇదంతా చూస్తుంటే తమ జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ సినిమాకు వచ్చిన క్రేజ్ ను తామే వాడేసుకోవాలని మైత్రీ సంస్థ భావిస్తోందేమో అనిపిస్తోంది. అదే విధంగా సుకుమార్ టేకింగ్, చరణ్ టైమ్ టేకింగ్ కలిసి ఆ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో, ఈలోగా మరోటి చేసేద్దామన్న ఆలోచనా కనిపిస్తోంది. 

కానీ పవన్ కళ్యాణ్ తనంతట తాను త్రివిక్రమ్ ను వదలడు అన్న పాయింట్ నే ఈ ఆలోచనలకు బ్రేక్ వేస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?