నాని-కిషోర్ ల సినిమా మరింత ఆలస్యం?

నాని-కిషోర్ తిరుమల కాంబినేషన్ అనగానే టాలీవుడ్ లో కాస్త ఆసక్తి నెలకొంది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో తన కంటూ ఓ స్టయిల్ ఆఫ్ మేకింగ్, ఎమోషనల్ సబ్జెక్ట్ డీల్…

నాని-కిషోర్ తిరుమల కాంబినేషన్ అనగానే టాలీవుడ్ లో కాస్త ఆసక్తి నెలకొంది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలతో తన కంటూ ఓ స్టయిల్ ఆఫ్ మేకింగ్, ఎమోషనల్ సబ్జెక్ట్ డీల్ చేయడంలో టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు కిషోర్ తిరుమల. ఇక హీరో నాని సంగతి వివరించాల్సిన పనిలేదు. ఇలాంటి కాంబినేషన్ సెట్ చేసుకున్న మైత్రీ మూవీస్ సంస్థ లక్కీనే అనుకున్నారు.

ఈసినిమా మార్చి మూడో వారంలో షూట్ స్టార్ట్ చేసుకుంటుందన్నది ఆ మధ్య వినవచ్చిన వార్త. ఇంచుమించు అదే టైమ్ లో కాస్త ముందుగా నాని-నాగ్ కాంబినేషన్ లోని సినిమా స్టార్ట్ అవుతుంది. ఈరెండింటి షూట్ సమాంతరంగా జరుగుతుంది.

కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, కిషోర్ తిరుమల స్క్రిప్ట్ విషయంలో ఇంకా నాని పూర్తిగా శాటిస్ ఫై కాలేదని, కాస్త టైమ్ పట్టవచ్చన్నది. ఈ స్క్రిప్ట్ డిస్కషన్లు ఇంకా జరగాల్సి వుంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం నాని గోవాలో వున్నారు. ఆయన రావడానికి కొంచెం టైమ్ పడుతుంది. వచ్చాక కృష్ణార్థున యుద్ధం పోస్ట్ ప్రొఢక్షన్, తన స్వంత సినిమా అ! ప్రమోషన్ లు, విడుదల వ్యవహరాలు వుంటాయ. ఆ తరువాత మళ్లీ ఈకథపై కూర్చుని ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

అందువల్ల మైత్రీ-కిషొర్ తిరుమల సినిమా కొంచెం ఆలస్యం కావచ్చని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అయితే మైత్రీకి కూడా హడావుడి ఏమీ లేదు. ఒక పక్క రామ్ చరణ్ రంగస్థలం విడుదల, మరోపక్క నాగ చైతన్య సవ్యసాచి మేకింగ్, ఇంకోపక్క శ్రీను వైట్ల-రవితేజ సినిమా షూట్ స్టార్ట్ ఇలా చాలా వ్యవహారాలు వున్నాయి. అందువల్ల మెల్లగానే ముందుకు వెళ్తారేమో?