తెరపైకి ఎయిర్ టెల్ పిల్ల

ఆ మధ్య జియో రాకముందు, వచ్చిన కొన్నాళ్ల పాటు చిన్న తెరపై ‘ఎయిర్ టెల్ పిల్ల’ ఒకరు తెగ హుషారుగా హల్ చల్ చేసింది. క్యూట్ గా కనిపిస్తూ, చమక్కయిన స్మయిల్ తో ఎయిర్…

ఆ మధ్య జియో రాకముందు, వచ్చిన కొన్నాళ్ల పాటు చిన్న తెరపై ‘ఎయిర్ టెల్ పిల్ల’ ఒకరు తెగ హుషారుగా హల్ చల్ చేసింది. క్యూట్ గా కనిపిస్తూ, చమక్కయిన స్మయిల్ తో ఎయిర్ టెల్ 4జి గురించి తెగ ప్రచారం చేసిన ఆ అమ్మాయి పేరు శాష ఛత్రి, డెహ్రాడూన్ స్వస్థలం. స్క్రీన్ మీద ఎంత  చలాకీగా వుంటుందో, ఆఫ్ ది స్క్రీన్ కూడా అంత చలాకీగానూ వుంటుందని బాలీవుడ్ లో పేరుంది.

ముంబాయిలో అడ్వర్టయిజింగ్ కోర్స్ చేసిన ఈ అమ్మాయి ఎయిర్ టెల్ తోనే తొలిసారిగా టీవీ మోడల్ గా మారింది. ఎయిర్ టెల్ ప్రకటనలతోనే బాగా పాపులర్ అయిపోయింది. ఆపైన బాలీవుడ్ లో ఎంట్రీ కోసం చూస్తోందని, పాటలు పాడడంలో కూడా ఆసక్తి వుందని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ అమ్మాయిని తెలుగులోకి తీసుకురావాలని చూస్తున్నారు. కాస్త చలాకీగా వున్న హీరోయిన్ ల కోసం టాలీవుడ్ వలేసి వెదుకుతోంది. సాయిపల్లవి, రష్మీ మడోన్నా లాంటి టీనేజ్ అమ్మాయిల హుషారుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్న సంగతి గమనించింది. అందుకే ఇలాంటి చలాకీ అమ్మాయిల కోసం తెగ గాలిస్తున్నారు.

అలాంటి సమయంలో ఈఎయిర్ టెల్ పిల్ల పై డైరక్టర్ అడవి సాయి కిరణ్ దృష్టి పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో కేరింత అనే యూత్ ఫుల్ సినిమా తీసి, ఫరవాలేదు అనిపించుకున్నాడు ఇతగాడు. ఇటీవల ఎయిర్ టెల్ అమ్మాయిని కలిసి. ఇక్కడకు రప్పించి, అడిషన్, స్క్రీన్ టెస్ట్ లు చేసి, ఓకె చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ప్రాజెక్టు కోసం ఇదంతా అన్న వివరాలు ఇంకా బయటకు రావాల్సి వుంది.