Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిఖిల్ సరసన షాలినీ పాండే ఫిక్స్

నిఖిల్ సరసన షాలినీ పాండే ఫిక్స్

మొత్తానికి గణితన్ తెలుగు వెర్షన్ కు హీరోయిన్ ఫిక్స్ అయింది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగునాట క్రేజ్ సంపాదించుకున్న థియేటర్ ఆర్టిస్ట్ షాలినీ పాండేకు ఈ సినిమాకు గాను అడ్వాన్స్ అందేసింది. ప్రస్తుతం బ్యాంకాక్ లో వున్న షాలిని తరపున ఆమె మేనేజర్ అడ్వాన్స్ అందేసుకున్నారు.

తమిళంలో పెద్ద హిట్ అయిన గణితన్ తెలుగు సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. రకరకాల కారణాలతో అవన్నీ పక్కకు వెళ్లాయి. కేథరిన్, రష్మీ మడొన్నా, అనుపమ ఇలా చాలా పేర్లు పరిశీలించారు. ఆఖరికి షాలినీ పాండేను ఫిక్స్ చేసారు.

షాలినీ పాండేకు తెలుగులో ఇది రెండో సినిమా అవుతుంది. తొలి సినిమాతో పోల్చుకుంటే మలి సినిమాకు చాలా మాంచి రెమ్యూనిరేషన్ ముట్టినట్లే. ఒక్క సినిమాతోనే షాలిని రెమ్యూనిరేషన్ పాతిక లక్షలు దాటేసినట్లు వినికిడి.

గణితన్ తమిళ సినిమాను రూపొందించిన సంతోష్ నే తెలుగు వెర్షన్ ను కూడా డైరక్ట్ చేస్తారు. దీనికోసం తెలుగు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గణితన్ తమిళ్ వెర్షన్ పై క్రిటిక్ సర్కిళ్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను, అలాగే తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో వుంచుకుని, మరింత బెటర్ మెంట్ కోసం మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్చి నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం నిఖిల్ ఫినిష్ చేసిన కిర్రాక్ పార్టీ విడులకు రెడీగా వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?