Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయిపల్లవి బారిన మరో హీరో?

సాయిపల్లవి బారిన మరో హీరో?

ఎంసిఎ సినిమా షూట్ టైమ్ లో హీరో నానికి హీరోయిన్ సాయిపల్లవికి పొసగలేదని వార్తలు వచ్చాయి. అదంతా వట్టిదే అని, అవన్నీ గ్యాసిప్ లు అనీ కొట్టి పారేసినా, ఎంత వరకు నిజం అన్నది ఇండస్ట్రీ జనాలకు తెలిసిందే. ఆ సినిమా అయిపోయింది. ఇప్పుడు మరో సినిమా విషయంలో కూడా ఇదే తరహా వార్తలు వినిపిస్తున్నాయి.

ఎఎల్ విజయ్ డైరక్షన్ లో ఓ తమిళ సిన్మాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అబార్షన్ల నేపథ్యంలో పిండం పగతీర్చుకోవడం లాంటి పాయింట్ తో తీస్తున్న హర్రర్ సినిమా అని టాక్ వుంది.

ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కీలకం అని సాయి పల్లవిని తీసుకున్నాడు ఎఎల్ విజయ్. అటు తమిళ, మళయాలంతో పాటు తెలుగు మార్కెట్ కూడా కలిసి వస్తుందని నాగశౌర్యను హీరోగా తీసుకున్నారు. హీరోయిన్ పాత్ర కీలకం అని తెలిసి కూడా, తమిళ మార్కెట్ లో ఎంటర్ అయినట్లు వుంటుందని నాగశౌర్య కూడా ఓకె అన్నాడు.

అంతా బాగానే వుంది కానీ సినిమా ఫినిష్ అయిన దగ్గర నుంచి నాగశౌర్యను పక్కన పెట్టేసారట. అసలు సినిమా అప్ డేట్స్ చెప్పడం కానీ, ఫంక్షన్లు, ప్రచారం ఇతరత్రా వ్యవహారాల్లో పట్టించుకోవడం కానీ మానేసారట.

దీనికి మరెవరూ కారణం కాదని, సాయిపల్లవే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరక్టర్ విజయ్ హీరోయిన్ సాయిపల్లవి ఎలా అంటే అలా వింటున్నారని, దాంతో ఈ సినిమాను కేవలం హీరోయిన్ సాయిపల్లవి సినిమా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, హీరోను పక్కన పెట్టేసారని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

కణం సినిమాను బంద్ కనుక లేకపోతే, వచ్చేనెల 9న విడుదల చేయబోతున్నారు. మరి తెలుగు నిర్మాత అయినా ప్రమోషన్ కు నాగశౌర్యను వాడుకుంటారో? సాయిపల్లవినే తీసుకువచ్చి, ఇతగాడిని పక్కన పెట్టేస్తారో? చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?