నితిన్.. మూడుభాగాల ప్రాజెక్టు

హీరో కొంత కాలంగా మౌనంగా వున్నాడు. కానీ ప్రాజెక్ట్ ల విషయంలో చురుగ్గానే వ్యవహరిస్తున్నాడని, ఇప్పుడు అతగాడి బర్త్ డే సందర్భంగా వస్తున్న న్యూస్ లను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ కుడుములతో భీష్మ…

హీరో కొంత కాలంగా మౌనంగా వున్నాడు. కానీ ప్రాజెక్ట్ ల విషయంలో చురుగ్గానే వ్యవహరిస్తున్నాడని, ఇప్పుడు అతగాడి బర్త్ డే సందర్భంగా వస్తున్న న్యూస్ లను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ కుడుములతో భీష్మ సినిమా వుంది. అలాగే చంద్రశేఖర్ యేలేటితో ఓ సినిమా వుంది. 

ఈ రెండింటికి తోడు డైరక్టర్ కృష్ణ చైతన్యతో ఓ వైవిధ్యమైన ప్రాజెక్టు చేయబోతున్నాడు. తొలిసారి తెలుగు తెరమీదకు ట్రయాలజీని తీసుకురాబోతున్నారు కృష్ణచైతన్య. మూడు భాగాలుగా వచ్చే ఈ సినిమా తొలి భాగానికి 'పవర్ పేట' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం. పవర్ స్టార్ గుర్తుకు వచ్చేలా పవర్ పేట అని ఫిక్స్ చేయడం విశేషం.

అయితే ప్రస్తుతం ఒప్పుకున్న భీష్మ సినిమా ఫినిష్ చేసి, ఆ తరువాత చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టును కొంత ఫినిష్ చేసి, పవర్ పేట సినిమా మీదకు వస్తాడు నితిన్. ఈ సినిమాను నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ మీదనే నిర్మిస్తారు. మిగిలిన వివరాలు అన్నీ తెలియాల్సి వుంది.

ప్రజల సొమ్ముతో ప్రలోభాలు.. ఇదే నయా రాజకీయం!