నితిన్-సురేందర్ కాంబో

సైరా సినిమా తరువాత అఖిల్ సినిమాను ప్లానింగ్ లో పెట్టుకున్నారు డైరక్టర్ సురేందర్ రెడ్డి. ఆ సినిమా తరువాత కూడా ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది.  Advertisement నితిన్ హీరోగా ఓ సినిమాను సురేందర్…

సైరా సినిమా తరువాత అఖిల్ సినిమాను ప్లానింగ్ లో పెట్టుకున్నారు డైరక్టర్ సురేందర్ రెడ్డి. ఆ సినిమా తరువాత కూడా ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. 

నితిన్ హీరోగా ఓ సినిమాను సురేందర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భీష్మ, రంగ్ దే లాంటి లవ్, రొమాంటిక్ జోనర్ లో, చెక్ వంటి థ్రిల్లర్ లో నటిస్తున్న నితిన్ తో ఓ పక్కా కమర్షియల్ మాస్ సినిమాను సురేందర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సంక్రాంతి బరిలోకి క్రాక్ లాంటి క్రేజీ సినిమాను తీసుకువస్తున్న టాగూర్ మధు ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వుంటారు. ఇప్పటికే నితిన్ తో అంథాదూన్ రీమేక్ లో కూడా టాగోర్ మధు భాగస్వామిగా వున్నారు. 

సురేందర్ సినిమా కూడా ఫిక్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు నితిన్ తో చేస్తున్నట్లు అవుతుంది. టాగూర్ మధుకి సురేందర్ సినిమా ఎప్పుడో చేయాల్సి వుంది. 

నిజానికి సైరా సినిమా తరువాత సినిమా ఆయనకే చేయాలి. కానీ క్రాక్ సినిమా నిర్మాణంలో వుండడంతో సురేందర్ ఏకె సంస్థ వైపు వెళ్లారు. దాని తరువాత మళ్లీ ఇటు వస్తారన్నమాట.

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం