ఎన్టీఆర్‌ వీళ్ల జాతకాలు మారుస్తాడా?

'జై లవకుశ'లో త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌ ఇప్పటికే తన రావణాసురుడి తరహా పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు. జై క్యారెక్టర్‌ ఎన్టీఆర్‌ కెరీర్లో ఉత్తమ పాత్రల్లో నిలిచిపోతుందని…

'జై లవకుశ'లో త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌ ఇప్పటికే తన రావణాసురుడి తరహా పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుని టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు. జై క్యారెక్టర్‌ ఎన్టీఆర్‌ కెరీర్లో ఉత్తమ పాత్రల్లో నిలిచిపోతుందని యూనిట్‌ సభ్యులు ముక్తకంఠంతో చెబుతున్నారు. కేవలం ఎన్టీఆర్‌ మీద నమ్మకంతోనే ఈ చిత్రానికి ఎనభై అయిదు కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది.

ఈ చిత్రం జయాపజయాలతో ఎన్టీఆర్‌ కెరీర్‌పై ఎంతటి ఎఫెక్ట్‌ వుంటుందనేది అటుంచితే, ఇది విజయవంతమైతే మాత్రం ముగ్గురి జాతకాలు మారిపోతాయి. ఇందులో హీరోయిన్లుగా నటించిన రాశి ఖన్నా, నివేథా థామస్‌కి ఇదే తొలి భారీ చిత్రం. ఇది కానీ హిట్‌ అయితే వారికి మరింతమంది స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలొస్తాయి.

అలాగే దర్శకుడు బాబీకి కూడా ఇది చాలా కీలకం. ఇప్పటికే సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ వల్ల తన కెరీర్‌కి పెద్ద దెబ్బ తగిలింది. ఈసారి కూడా అతను మిస్‌ఫైర్‌ అయితే మాత్రం బాబీపై ఏ కొంచెం నమ్మకం వున్నా పూర్తిగా సడలిపోతుంది. నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌ ఎలాగో దండిగా లాభాలు చూసేసాడు కనుక ప్రధానంగా ఈ చిత్రం విజయం ఈ ముగ్గురి రాత మార్చేస్తుంది.