ఒక్క క్షణం సినిమాకు నోటీసులు

ఒక్క క్షణం. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ క్యాంప్ నుంచి ఈ నెలాఖరులో వస్తున్న సినిమా. పారలల్ లైఫ్ అన్న పాయింట్ ఆధారంగా తయారైన థ్రిల్లర్. అల్లు శిరీష్, అవసరాల శ్రీనివాస్ వి కీలకపాత్రలు.…

ఒక్క క్షణం. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ క్యాంప్ నుంచి ఈ నెలాఖరులో వస్తున్న సినిమా. పారలల్ లైఫ్ అన్న పాయింట్ ఆధారంగా తయారైన థ్రిల్లర్. అల్లు శిరీష్, అవసరాల శ్రీనివాస్ వి కీలకపాత్రలు. ఎక్కడికి పోతావు చిన్నవాడా విజయం తరువాత దర్శకుడు ఆనంద్ అందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. 

కానీ ఇప్పుడు ఈ సినిమాకు సమస్య వచ్చి పడింది. ఒక్కక్షణం సినిమా లైన్ ఓ కొరియన్ సినిమా నుంచి తెచ్చేసుకున్నది. మన డైరక్టర్లకు ఈ కొట్టేయడం అలవాటే గా. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆ ఒరిజినల్ సినిమా హక్కులు తీసుకుని మరీ '2 – మేమిద్దరం' అనే చిన్న సినిమాగా కొత్తవాళ్లతో గప్ చుప్ గా నిర్మిస్తోంది ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. 

కానీ ఒక్కక్షణం సినిమా విడుదలయితే, ఇక ఆ సినిమా వృధా అవుతుంది. పైగా రైట్స్ కొనుకున్నది వేస్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఛాంబర్ మెట్లు ఎక్కింది. అక్కడితో ఆగకుండా ఒక్క క్షణం నిర్మాతలకు, దర్శకుడికి లాయర్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా ఒక్కక్షణం విడుదలపై స్టే తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ లోగా డిస్కషన్ తో సమస్యను పరిష్కరించాలని కూడా చూస్తున్నట్లు వినికిడి.