Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'పైసా వసూల్' అయినట్లే

'పైసా వసూల్' అయినట్లే

బాలయ్య-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా నిర్మించారు భవ్య ఆనంద్ ప్రసాద్. దాదాపు మిగిలిన బాలయ్య సినిమా నిర్మాతల మాదిరిగానే ఆయన కూడా నష్టాలే చవిచూసారు. అయితేనేం మిగిలిన నిర్మాతల సంగతి ఎలా వున్నా, ఆయనకు మాత్రం పైసా వసూలయినట్లే.

ఎందుకంటే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కింది. గట్టిపోటీ అక్కడ టికెట్ కోసం వున్నా, పార్టీ అండ లభించడం వెనుక బాలయ్య అభయహస్తం వుందని టాక్. అంటే ఆ విధంగా పైసా వసూలు అయిందన్నమాట.

సాధారణంగా పార్టీ ఫండ్ అంటూ కోట్లు ఇవ్వాల్సి వుంటుంది ఒక్కోసారి పార్టీ టికెట్ కోసం. అలాంటిది ఏమీలేకుండా టికెట్ వరించింది అంటే పైసా వసూల్ అయినట్లే అనుకోవాలి. అయితే ఇలా ఎవరన్నా అనుకునే ప్రమాదం వుందని, లేదా పార్టీలోకి సడెన్ గా వచ్చి టికెట్ ఎగరేసుకుపోయారని అనుకుంటారని ముందే ఊహించారేమో?

భవ్య ప్రసాద్ ఎప్పటి నుంచో పార్టీలో వున్నారని, బాబుకు సన్నిహితంగా మసులుకునేవారు అని తెలియచెప్పే ఫొటొలు కొన్ని వాట్సాప్ లో చలామణీ చేస్తుండడం విశేషం. కానీ గతంలో ఎమ్మెల్సీ అవుదామని ఓ నిర్మాత వచ్చి, సినిమా తీసి బాగా నష్టపోయి, కొన్ని ఆస్తులు కూడా అమ్ముకున్నారని టాక్ వుండేది.

కానీ అతగాడిని మాత్రం అదృష్టం వరించలేదు. అంటే సినిమా తీస్తేచాలదు. బ్యాకింగ్ వుండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ వుండాలేమో?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?