Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పరుశురామ్ మళ్లీ ఆ హీరో కోసం..?

పరుశురామ్ మళ్లీ ఆ హీరో కోసం..?

గీత గోవిందం తరువాత పెద్ద సినిమానే అనుకుంటూ ఇన్నాళ్లుగా ఖాళీగా వున్నారు దర్శకుడు పరుశురామ్. మహేష్ తో సినిమా అని కథ రెడీ చేసారు. కానీ అది అల్లు అరవింద్ కు అంతగా నచ్చకపోవడంతో, వేరే బ్యానర్ లో చేయడం కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ మహేష్ బాబు మరో సినిమా రెడీగా లైన్ లో పెట్టేయడంతో, ఇంకెవరు దొరుకుతారా? అని ప్రయత్నాలు చేస్తున్నారు పరుశురామ్.

ఆ క్రమంలో, ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ డేట్ ల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కు లైన్ చెప్పి ఓకె చేయించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గీతగోవిందం కాంబినేషన్ అంటే క్రేజ్ వుంటుంది కాబట్టి మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

కానీ విజయ్ దేవరకొండ అటు విక్రమ్ కే కుమార్ స్క్రిప్ట్ వినేందుకు రెడీ అవుతున్నారు. అదికాక చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. మరి ఈ నేపథ్యంలో పరుశురామ్ కు అవకాశం ఏమేరకు వుంటుందన్నది చూడాలి.

పోనీ మహేష్ సినిమా చేసేలోగా ఓ చిన్న సినిమా చేద్దాం అంటే పరుశురామ్ రెమ్యూనిరేషన్ నే అయిదు కోట్ల వరకు వుంటుంది. అప్పుడు హీరో రేంజ్ సరిపోవాలి. అందుకే మహేష్ కాకఫోతే విజయ్ నే బెటర్ అనే పనిలో పరుశురామ్ వున్నట్లు తెలుస్తోంది.

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?