పరువు హత్యల నేఫథ్యంలో…

మెగా హీరోల వరుసలో లేటెస్ట్ గా జాయిన్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. డైరక్టర్ సుకుమార్ సహాయకుడు బుచ్చిబాబు డైరక్షన్ లో ఓ సినిమాను మైత్రీమూవీస్ లో చేస్తున్నాడు. మత్యకారుల కుటుంబానికి చెందిన అబ్బాయికి, వేరే…

మెగా హీరోల వరుసలో లేటెస్ట్ గా జాయిన్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. డైరక్టర్ సుకుమార్ సహాయకుడు బుచ్చిబాబు డైరక్షన్ లో ఓ సినిమాను మైత్రీమూవీస్ లో చేస్తున్నాడు. మత్యకారుల కుటుంబానికి చెందిన అబ్బాయికి, వేరే కులానికి చెందిన అమ్మాయికి మధ్య ఈస్ట్ గోదావరిలో రియల్ గా జరిగిన ఓ ఫ్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

చాలా రస్టిక్, ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పరువు హత్యల నేపథ్యంలో ఈ కథను అల్లుకున్నారని, సినిమా కథ ప్రస్తుతానికి అయితే విషాదాంతమని తెలుస్తోంది. తొలి సినిమాకే కాస్త నటనకు, చూసిన జనం మాట్లాడుకోవడానికి వీలయిన సబ్జెక్ట్ ను ఎంచుకోవడం విశేషం.

మెగా హీరోలు సాధారణంగా మాస్ సినిమాల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచి మేరకు వైష్ణవ్ ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ సినిమాకు జాలరి అనే టైటిల్ పెట్టారని వార్తలు వినవచ్చాయి. కానీ అది టైటిల్ కానే కాదని, సరైన టైటిల్, సరైన సమయంలో ఫిక్స్ చేస్తామని, అప్పుడే అనౌన్స్ చేస్తామని యూనిట్ అంటోంది.

మరీ దెబ్బతినని మోడీ ఇమేజ్… కోలుకున్నా పుంజుకోని కాంగ్రెస్!