Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పింకు లేదు..పెంకు లేదు..అప్పుడే

పింకు లేదు..పెంకు లేదు..అప్పుడే

అదిగో సినిమా అంటే ఇధిగో హీరోయిన్ అన్నట్లుంటుంది ఇప్పటి వ్యవహారం. పింక్ సినిమా రీమేక్ అనే దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకె అన్నారు. అంత వరకు పక్కా వాస్తవం.

వాస్తవానికి ఈ ప్రతిపాదనకు పవన్ ఓకె అన్నది ఆయన సన్నిహితుడు త్రివిక్రమ్ తేవడం వల్ల. నిర్మించాలనుకున్న దిల్ రాజు, హక్కులు వున్న బోనీ కపూర్ కూడా భాగస్వాములు. త్రివిక్రమ్ అంటే హారిక హాసిని కాబట్టి, వారు కూడా వాటాదారులే.

ఇంతవరకు మాత్రమే జరిగింది. ఎప్పుడు..ఎక్కడ..ఎలా..ఎవరితో..ఎంతకు అన్నవి ఏవీ ఒక్క అంగుళం కూడా కదలలేదు. కానీ బయట మాత్రం నయన తార, పూజా హెగ్డే, తమన్నా ఇలా చాలా అంటే చాలా పేర్లు వినిపించేస్తున్నాయి. దీనికి కూడా కారణం లేకపోలేదు. అన్నపూర్ణలో ఓ ఫ్లోర్ ను కోర్టు సెట్ కోసం బుక్ చేసి వుంచడంతో ఊహాగానాలు వినిపించడం ప్రారంభమైంది.

కానీ ఆ ఫ్లోర్ బుక్ చేయడం వెనుక వేరే కథ వుంది. ఆ ఫ్లోర్ ను అల వైకుంఠపురంలో సినిమా కోసం బుక్ చేసారు. అది అయిపోయాక సరిలేరు నీకెవ్వరు పాట కోసం బుక్ చేసారు. అన్నపూర్ణలో వున్న ఫ్లోర్ లు తక్కువ. తీరా చేసి బుక్ చేయకపోతే సమస్య అవుతుందేమో అవసరం పడితే అనే ఆలోచనతో సరిలేరు సినిమా కాగానే మళ్లీ హారిక హాసినియే బుక్ చేసింది. ఎందుకంటే ఎలాగూ మూడు సినిమాలు వున్నాయి, దేనికో దానికి పనికి వస్తుందనే ఆలోచనతో.

వాస్తవానికి బోనీ కపూర్ తొందరపడి బాలీవుడ్ లో ఫ్రకటన చేసినపుడే పింక్ రీమేక్ కు దూరంగా వుండాలని త్రివిక్రమ్ కాస్త అనుకున్నారని బోగట్టా. అయితే అప్పటికప్పుడు ఆవేశపడకుండా పవన్ తో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని ఆగారన్నది కూడా వాస్తవం. అందువల్ల  స్క్రిప్ట్, సినిమా విషయంలో త్రివిక్రమ్ కూడా ఇంకా ముందు వెనుకల ఆలోచనతోనే వున్నారు.

పవన్ విశాఖ టూర్ నుంచి తిరిగి రావాలి.త్రివిక్రమ్ పారిస్ నుంచి రావాలి. ఇద్దరూ కూర్చున్నాక కానీ అసలు పింక్ వ్యవహారం ఏమిటి? అన్నది తేలదు. అప్పుడు కానీ ఇక స్టార్ట్ కాస్ట్ అన్నది తెలియదు. అప్పటి దాకా ఈ ఊహాగానాలు సాగుతూనే వుంటాయి. 

ఇవి విని, చదివి తివిక్రమ్ అండ్ కో నవ్వుకుంటూనే వుంటారు. ఎందుకు అంటే ఒక్కటి మాత్రమే పక్కా పింక్ చేయడానికి పవన్ ఒప్పుకున్నారు. అంత వరకే. మిగిలినవన్నీ గాలి వార్తలే కనుక.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?