ప్రభాస్ కోసం ఆ ముగ్గురూ

బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ట్రయిలర్ లాంచ్ ఫంక్షన్ ఈ రోజు జ‌రగబోతోంది. ఈ ఫంక్షన్ కు రెగ్యులర్ ఫార్మాట్ లో యాంకర్ సుమ కాకుండా, కాస్త వైవిధ్యంగా వుండేదుకు నవీన్…

బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ట్రయిలర్ లాంచ్ ఫంక్షన్ ఈ రోజు జ‌రగబోతోంది. ఈ ఫంక్షన్ కు రెగ్యులర్ ఫార్మాట్ లో యాంకర్ సుమ కాకుండా, కాస్త వైవిధ్యంగా వుండేదుకు నవీన్ పోలిశెట్టిని తీసుకువస్తున్నారు. ప్రభాస్ కోసం నవీన్ ఈ ఫంక్షన్ ను హోస్ట్ చేయబోతున్నాడు. 

అతనికి కో హోస్ట్ గా జ‌బర్దస్త్ రష్మి వుంటుంది. నిజానికి రష్మి యాంకరింగ్ మానేసి చాలా కాలం అయింది. చాలా గ్యాప్ తరువాత బయట స్టేజ్ మీద రష్మి కనిపిస్తోంది. 

ఇదిలా వుంటే ఈ పంక్షన్ కు ప్రత్యేక ఆకర్షణగా ముగ్గురు టాప్ డైరక్టర్లు రాబోతున్నారు. నాగ్ అశ్విన్, సందీప్ వంగా, ఓరౌంత్ కలిసి ఈ పంక్షన్ కు హాజ‌రవుతున్నారు. ఈ ముగ్గురూ ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మొత్తం మీద రాధేశ్యామ్ సినిమాకు ఊపు తీసుకువచ్చే లెవెల్ లో ఈ ఫంక్షన్ వుండబోతోందని క్లారిటీ వచ్చేసినట్లే. ఇక ట్రయిలర్ కూడా ఆకట్టుకుంటే సంక్రాంతికి రాధేశ్యామ్ సరైన పోటీ అవుతుంది. 

చిరకాలంగా నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ హస్త సాముద్రికుడిగా కనిపించబోతున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ సినిమా మొత్తం రోమ్ నేపథ్యంలో వుంటుంది.