సచిన్‌ని చూడ్డానికి వెళ్తున్న ప్రిన్స్‌

దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకొంది. అంతా క్రికెట్‌ దేవుడు.. సచిన్‌ జ్వరంతో ఊగిపోతున్నారు. సచిన్‌ బ్యాటు పట్టుకొని బౌండరీలు బాదే క్షణాలు ఇక చూళ్లేం. అందుకే.. సచిన్‌ ని అభిమానించేవారంతా వాంఖడే స్టేడియం వైపు అడుగులు…

దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకొంది. అంతా క్రికెట్‌ దేవుడు.. సచిన్‌ జ్వరంతో ఊగిపోతున్నారు. సచిన్‌ బ్యాటు పట్టుకొని బౌండరీలు బాదే క్షణాలు ఇక చూళ్లేం. అందుకే.. సచిన్‌ ని అభిమానించేవారంతా వాంఖడే స్టేడియం వైపు అడుగులు వేస్తున్నారు. అక్కడ జరగబోయే సచిన్‌ 200వ టెస్ట్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష్యంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఆ జాబితాలో మహేష్‌ బాబు కూడా చేరిపోయాడు. చాలామందికి తెలియని సంగతేంటంటే.. మహేష్‌ మంచి క్రికెట్‌ ప్లేయర్‌. అందులోనూ సచిన్‌కి వీరాభిమాని. అందుకే సచిన్‌ ఆడబోయే చివరి టెస్ట్‌నిచూడాలని నిర్ణయించుకొన్నాడట. 

అయిదు రోజుల మ్యాచ్‌ కదా.. తప్పకుండా ఓ రోజు నేరుగా సచిన్‌ ని చూడాలని మహేష్‌ నిర్ఱయించుకొన్నాడట. ప్రస్తుతం మహేష్‌ నటిస్తున్న 1 చిత్ర షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. అటు నుంచి అటుగా మహేష్‌ ముంబై వెళ్లి మ్యాచ్‌ని చూస్తాడని సమాచారమ్‌.