దిల్లు, అల్లు మధ్య ‘ఎవడు’

‘ఎవడు’ సినిమా విడుదల ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. డిసెంబర్‌ 19న సినిమా విడుదల చేస్తామని చెప్పిన దిల్‌ రాజు ఇంతవరకు బయ్యర్స్‌కి ఆ డేట్‌ ఫిక్స్‌ అయినట్టు సమాచారం ఇవ్వలేదు. ప్రొడ్యూసర్‌…

‘ఎవడు’ సినిమా విడుదల ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. డిసెంబర్‌ 19న సినిమా విడుదల చేస్తామని చెప్పిన దిల్‌ రాజు ఇంతవరకు బయ్యర్స్‌కి ఆ డేట్‌ ఫిక్స్‌ అయినట్టు సమాచారం ఇవ్వలేదు. ప్రొడ్యూసర్‌ నుంచి డేట్‌కి సంబంధించిన క్లియర్‌ ఇండికేషన్‌ వస్తే తప్ప బయ్యర్లు థియేటర్లని బ్లాక్‌ చేయరు. సినిమా ఎప్పుడో రెడీ అయిపోయి ఉంది కాబట్టి ఇంకా ఎందుకు డేట్‌ గురించి బయ్యర్స్‌కి ఇన్‌ఫర్మేషన్‌ ఇవ్వలేదు?

చిత్ర వర్గాల సమాచారాన్ని బట్టి ‘ఎవడు’ సినిమాని సంక్రాంతికి విడుదల చేయమని అల్లు అరవింద్‌ చెప్తున్నారట. ఈ చిత్రాన్ని కొన్ని మేజర్‌ ఏరియాస్‌లో పంపిణీ చేస్తున్న అల్లు అరవింద్‌ దీనిని ఆఫ్‌ సీజన్‌ అయిన డిసెంబర్‌లో విడుదల చేయడానికి ఇష్టపడడం లేదట. ఆల్రెడీ లేట్‌ అయి స్టేల్‌ అయిన సినిమా కాబట్టి సంక్రాంతి లాంటి పెద్ద పండక్కి విడుదలైతే ఎక్కువ లాభం ఉంటుందనేది ఆయన థియరీ అంటున్నారు. 

కానీ మహేష్‌ ‘1’ వస్తోంది కాబట్టి, థియేటర్ల కొరత ఉంటుందని, అదే డిసెంబర్‌లో వస్తే ఎలాంటి సమస్య ఉండదని దిల్‌ రాజు భావిస్తున్నట్టు భోగట్టా. దిల్‌ రాజు, అల్లు అరవింద్‌ ఈమధ్యే ఈ విషయంపై మిగతా ఏరియాల పంపిణీదారులతో చర్చించారట. డిసెంబర్‌ 19 కంటే జనవరి 9 లేదా 11నే ఈ సినిమా రావడానికి అవకాశాలు ఎక్కువనేది ఫిలిం సర్కిల్స్‌ రిపోర్ట్‌.