Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి చూపు ఎన్టీఆర్ వైపు

పూరి చూపు ఎన్టీఆర్ వైపు

టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ కు కొత్త హోప్ కలిగించిన డైరక్టర్ పూరి జగన్నాధ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఇజమ్ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత ఏ ప్రాజెక్టు చేతిలో లేదు. మహేష్ మాట ఇచ్చారు కానీ, అది సెట్ మీదకు వెళ్లేది ఎప్పుడన్నదాంట్లో క్లారిటీ లేదు. మురుగదాస్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి ముగ్గురు అదే ఆర్టర్ లో లైన్ లో వున్నారు. ఆ తరువాత పూరి సంగతి. ఇక మరే హీరో కూడా ఇప్పట్లో పూరికి అందుబాటులోలేనట్లే.

అందుకే మరోసారి ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని పూరి జగన్నాధ్ భావిస్తునట్లు తెలుస్తోంది. ఎందుకంటే వక్కతం వంశీ తో తప్ప మరే కమిట్ మెంట్ ఎన్టీఆర్ కు లేదు. అలా అని చెప్పి రెడీగా డైరక్టర్లు కూడా లేరు. అందువల్ల మళ్లీ మంచి సబ్జెక్ట్ తో పూరి రెడీగా వున్నారని వినికిడి. జనతాగ్యారేజ్ హడావుడి ముగిసాక తారక్ ను కలిసి లైన్ చెప్పే ఆలోచనలో పూరి వున్నారని తెలుస్తోంది.

వక్కతం వంశీతో చేసే సినిమా ఎన్టీఆర్ ఓన్ ప్రాజెక్ట్. కళ్యాణ్ నిర్మాత అయితేనేం, తారక్ అయితేనేం అంతా ఓ ఫ్యామిలీనే. కిక్ 2 విడుదలప్పుడు కూడా తారక్ నే ఆర్థికసమస్యలకు అడ్డంపడి విడుదలయ్యేలా చేసారు. అందువల్ల వక్కతం వంశీ ప్రాజెక్టును ఎన్టీఆర్ నే డీల్ చేసుకుంటారు. ప్రాజెక్టు ప్రకటిస్తే, అడ్వాన్స్ లు అవే వస్తాయి. బండి స్టార్ట్ అయిపోతుంది. మరి పూరి అడిగితే ఈ ప్రాజెక్టును వెనుక పెట్టే అవకాశం వుందా లేదా? అన్నది జనతా గ్యారేజ్ ఫలితంపై ఆధారపడి వుంటుంది. గ్యారేజ్ హిట్ అయితే, ఆ ఊపును స్వంత ప్రాజెక్టుపైకి వెళ్లిపోవచ్చు. మంచి లాభాలు చేసుకోవచ్చు.

కానీ గ్యారేజ్ ఫలితం తేడావస్తే మాత్రం ఎన్టీఆర్ వక్కతం వంశీతో చేయడం రిస్కే అవుతుంది. ఏ విషయం తేలాలంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?