Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే

రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే

హీరో రాజ్ తరుణ్ సినిమా ప్రారంభమైంది. వరుస ఫ్లాపుల తరువాత సైలంట్ గా వుండిపోయిన రాజ్ తరుణ్ మళ్లీ మేకప్ వేసుకుని సెట్ మీదకు వచ్చాడు. కృష్ణారెడ్డి అనే దర్శకుడి డైరక్షన్ లో నిర్మాత దిల్ రాజు నిర్మించే సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. అతగాడి సరసన మేఘా ఆకాష్ నటించే అవకాశం వుంది. ఆ మేరకు డిస్కషన్లు సాగుతున్నాయి.

ఈ కృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ఎవరో కాదు. గతంలో సుధీర్ బాబుతో ఆడు మగాడ్రా బుజ్జీ అనే మాస్ సినిమా ట్రయ్ చేసిన దర్శకుడే. ఈసారి మాత్రం మాంచి లవ్ స్టోరీతో రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చాడు. ఈరోజు ముహుర్తం చేసారు. వెంటనే సెట్ మీదకు వెళ్తున్నారు.

ఇద్దరి లోకం ఒకటే అని టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమాకు హైదరాబాద్ లో ఓ వన్ వీక్ షెడ్యూలు చేసి, తరువాత, ఊటీకి షిప్ట్ అవుతారు.అక్కడ ఓ లెంగ్తీ షెడ్యూలు చేసుకుని వచ్చి, ఆపైన మళ్లీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

రాజ్ తరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?