ఆమెను మళ్లీ రిపీట్ చేస్తున్న రామ్

హీరో రామ్ సరసన మరోసారి మెరవనుంది మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో త్వరలోనే  ఓ సినిమా చేయబోతున్నాడు రామ్. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటున్నారు. Advertisement…

హీరో రామ్ సరసన మరోసారి మెరవనుంది మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో త్వరలోనే  ఓ సినిమా చేయబోతున్నాడు రామ్. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటున్నారు.

నిజానికి ఈ పాత్ర కోసం మొన్నటివరకు “ఛలో” బ్యూటీ రష్మికతో చర్చలు జరిపారు. అంతలోనే ఏమైందో సడెన్ గా అనుపమ పేరు తెరపైకి వచ్చింది. సినిమాలో వీళ్లిద్దరూ ఉన్నారా.. లేక అనుపమకు మాత్రమే చోటిచ్చారా అనే విషయం త్వరలోనే తేలిపోతుంది.

ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో కలిసి నటించారు రామ్-అనుపమ. తన ప్రాణస్నేహితుడి కోసం అనుపమపై ఉన్న ప్రేమను త్యాగం చేస్తాడు రామ్. కొత్త సినిమాలో మాత్రం అనుపమపై ఉన్న ప్రేమ కోసం దేనికైనా తెగించే యువకుడిగా కనిపించబోతున్నాడు.

ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషించనున్న ఈ సినిమా మార్చి నుంచి సెట్స్ పైకి రాబోతోంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. మ్యూజిక్ డైరక్టర్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.