Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ తో పోటీకి సందీప్ రెడీ

రామ్ తో పోటీకి సందీప్ రెడీ

హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారి చేసిన తొలి సినిమా నిను వీడని నీడను నేనే. ఈ సినిమాను జూలై 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. అదేరోజు పూరి జగన్నాధ్-రామ్ఇస్మార్ట్ శంకర్ కూడా వుంది. వెంకటాద్రి ప్రొడక్షన్స్ అంటూ బ్యానర్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్, తొలి సినిమాను కార్తీక్ సుబ్బరాజు డైరక్షన్ లో నిర్మించాడు.

ఈ సినిమా కోసం రచయిత కోన వెంకట్ బంధువు, సినీ స్టయిలిస్ట్ కోన నీరజ ఓ పాట రాయడం విశేషం. అది కూడా టైటిల్ సాంగ్. నిను వీడని నీడను నేనే అంటూ సాగే ఈ పాటకు థమన్ ట్యూన్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి తయారుచేసిన ఈ కథను కాస్త ఎక్కువ ఖర్చుతోనే తెరకెక్కించారు.

సినిమాను అవుట్ రేట్ పంపిణీ బాధ్యతను నిర్మాత అనిల్ సుంకర తీసుకున్నారు. ఆయన తన ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సినిమాను విడుదల చేస్తున్నారు. సందీప్ సరసన అన్యాసింగ్ నటిస్తున్న ఈ సినిమాలో పోసాని, మురళీశర్మ, వెన్నెల కిషోర్, తదితరులు నటిస్తున్నారు.

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే - పవన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?