కాజల్ తో సౌత్ టూర్ ప్లాన్ చేసిన రానా

నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సంబంధించి రానా కేవలం హీరో మాత్రమే కాదు. తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.  Advertisement మీడియా ముందుకురానని తేజ…

నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సంబంధించి రానా కేవలం హీరో మాత్రమే కాదు. తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. 

మీడియా ముందుకురానని తేజ ప్రకటించడంతో ఈ సినిమా ప్రచార బాధ్యతని కూడా తనే తీసుకున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం కల్పిస్తున్న రానా.. త్వరలోనే సౌత్ లోని కొన్ని సిటీస్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నాడు.

నేనే రాజు నేనే మంత్రి సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. సో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులోని ముఖ్య పట్టణాల్లో సినిమాకు ప్రచారం కల్పించాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు తనతో పాటు కాజల్ ను కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు రానా.

తను నటించిన సినిమాలకు ప్రచారం కల్పించడానికి కాజల్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపదు. అయితే ఈ మూవీకి మాత్రం రానాతో కలిసి ప్రచారం చేసేందుకు ఒప్పుకుందట. మరో హీరోయిన్ క్యాథరీన్ ఎలాగూ రెడీగా ఉంటుంది.

ఈ సినిమాలో జోగేంద్ర అనే పొలిటికల్ లీడర్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. రానాకు భార్యగా కాజల్, గర్ల్ ఫ్రెండ్ గా క్యాథరీన్ నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదలకానుంది.