రంగస్థలం హిట్-చైతూ ఫుల్ హ్యాపీ

రంగస్థలం హిట్ నాగచైతన్య-సమంత జంటకు కూడా మాంచి ఆనందాన్ని ఇస్తోందట. ఆ విషయం వాళ్లు సన్నిహితులతో మాట్లాడినపుడు క్లియర్ గా తెలుస్తోందట. చైతూ తరువాత సినిమా సవ్యసాచి మైత్రీ మూవీస్ బ్యానర్ లోనే. Advertisement…

రంగస్థలం హిట్ నాగచైతన్య-సమంత జంటకు కూడా మాంచి ఆనందాన్ని ఇస్తోందట. ఆ విషయం వాళ్లు సన్నిహితులతో మాట్లాడినపుడు క్లియర్ గా తెలుస్తోందట. చైతూ తరువాత సినిమా సవ్యసాచి మైత్రీ మూవీస్ బ్యానర్ లోనే.

మూడు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన బ్యానర్ లో సినిమా అంటే ఆ హీరోకు కాస్త హ్యాపీగానే వుంటుంది. పైగా రెండు హిట్ లు ఇచ్చిన చందుమొండేటి డైరక్టర్. సో, సినిమా అమ్మకాలకు, ఓపెనింగ్స్ కు మంచి ఊపు వుంటుంది. అసలే యుద్ధం శరణం వంటి బ్యాడ్ మూవీని మరిచిపోవాల్సి వుంది. ఇప్పుడు మైత్రీ, చందు మొండేటి కాంబినేషన్ తో అదంతా వెనక్కుపోతుంది.

ఇక చైతూ బెటర్ హాఫ్ సమంతకు కూడా రంగస్థలం మంచి పేరు తెచ్చింది. కేవలం అది మాత్రమే కారణంకాదు. సవ్యసాచి తరువాత లైన్లో వున్న ఓ సినిమాలో సమంత-చైతూ కలిసి నటిస్తున్నారు. చానాళ్ల తరువాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. పైగా రంగస్థలం తరువాత సమంత సినిమా ఇదే. అందువల్ల ఆ విధంగా ఆ సినిమాకు క్రేజ్ వస్తుంది.

ఇలా అన్ని విధాలా రంగస్థలం సినిమా హిట్ అన్నది చైతూ-సమంతల సినిమాలకు ప్లస్ అవుతోంది. దీంతో ఆ జంట ఫుల్ హ్యాపీ. ఇటీవలే అమెరికాలో ఫుల్ గా టూర్ చేసి వచ్చారు ఇద్దరూ. 16నుంచి మారుతి సినిమా శైలజారెడ్డి అల్లుడు షూటింగ్ కు చైతన్య రెడీ అవుతున్నాడు.