రంగస్థలం సింగిల్ రిలీజ్ వాయిదా

శ్రీదేవి మరణం టాలీవుడ్ ను కాస్త గట్టిగానే షేక్ చేసింది. ముందుగా ప్లాన్ చేసిన చాలా కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే నాగ్-వర్మ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, రిలీజ్ డేట్ ప్రకటన జరగలేదు.…

శ్రీదేవి మరణం టాలీవుడ్ ను కాస్త గట్టిగానే షేక్ చేసింది. ముందుగా ప్లాన్ చేసిన చాలా కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే నాగ్-వర్మ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, రిలీజ్ డేట్ ప్రకటన జరగలేదు.

అలాగే రామ్ చరణ్-సుకుమార్ రంగస్థలం సినిమా సెకెండ్ సింగిల్ విడుదల కూడా వాయిదా పడిపోయింది. వాస్తవానికి అది 26కు విడుదల కావాలి. సెకెండ్ సింగిల్ లో లిరికల్ వీడియోతో పాటు ఒకటి రెండు నిమిషాల రంగస్థలం వీడియో బైట్ కూడా వదులుదాం అనుకున్నారు.

కానీ ఇప్పుడు అన్నీ వాయిదా పడిపోయాయి. శ్రీదేవి మరణం తరువాత ఇండస్ట్రీ మాత్రమే కాకుండా, మీడియా, సినిమా అభిమానులు అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె విశేషాలే ముచ్చటించుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా శ్రీదేవి సంగతులతో నిండిపోతోంది. అందువల్ల ఇప్పుడు విడుదల చేస్తే, దానిపై అంతగా దృష్టి పడకపోవచ్చు.

ఇలాంటపుడు విడుదల చేయడం అంత బాగోదని, పైగా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా శ్రీదేవితో మంచి సినిమాలు చేసి వున్నారు కాబట్టి, ఇలాంటపుడు ఇలా విడుదల చేయడం సరికాదని నిర్మాతలు, దర్శకుడు భావించినట్లు తెలుస్తోంది. దాంతో మొత్తానికి ప్రస్తుతానికి అయితే వాయిదా వేసేసారు.