రంగ్ దే డీల్ నేడో..రేపో

భీష్మ లాంటి మాంచి సూపర్ హిట్ తరువాత హీరో నితిన్ చేస్తున్న సినిమా రంగ్ దే. కీర్తి సురేష్ కథానాయిక. కరోనా ముందు ఈ సినిమా మీద మాంచి అంచనాలు వున్నాయి.  Advertisement సమ్మర్…

భీష్మ లాంటి మాంచి సూపర్ హిట్ తరువాత హీరో నితిన్ చేస్తున్న సినిమా రంగ్ దే. కీర్తి సురేష్ కథానాయిక. కరోనా ముందు ఈ సినిమా మీద మాంచి అంచనాలు వున్నాయి. 

సమ్మర్ లో కలెక్షన్ల కొల్లగొడుతుందని నిర్మాతలు ధీమాగా వున్నాయి. అలాంటి టైమ్ లో కరోనా వచ్చి అంతా మార్చేసింది. థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి. 

ఇలాంటి నేపథ్యంలో రంగ్ దే కు ఓటిటి ప్లాట్ ఫారమ్ ల నుంచి ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. కానీ రేటు దగ్గరే సమస్య అవుతోంది. లాస్ట్ ప్రయిస్ గా అన్ని రకాల హక్కులుకు 38 కోట్లు కావాలని నిర్మాతలు ఆశిస్తున్నారు.  

కీలకంగా బేరంలో వున్న జీ టీవీ 35 వరకు (అన్ని హక్కులు కలిపి) ఆఫర్ చేస్తోంది. ఈ దిశగా గత కొద్ది రోజులుగా జీ టీవీ తో నిర్మాతలు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బేరాలు సాగుతున్నాయి. 

ఈ బేరాలు నేడో, రేపో కొలిక్కి వస్తాయని తెలుస్తోంది.  అయితే జీటీవీ టోటల్ హక్కులు తీసుకున్నా, థియేటర్లలో విడుదల హక్కులు మళ్లీ విక్రయించే అవకాశం వుంది. ఇటీవల సోలో బతుకే సో బెటరు హక్కులు అలాగే విక్రయించేసారు. 

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?