రోహిత్ సినిమాలో శౌర్య-ఆదాశర్మ

నారా రోహిత్ సినిమా కథలో రాజకుమారికి మల్టీస్టారర్ కళ వస్తోంది. కార్తికేయ సినిమా నిర్మాత శ్రీనివాస్ ఓ సినిమాను నారా రోహిత్ హీరోగా మహేష్ సూరపనేని ప్లాన్ చేసారు. కథలో రాజకుమారి అనే ఈ…

నారా రోహిత్ సినిమా కథలో రాజకుమారికి మల్టీస్టారర్ కళ వస్తోంది. కార్తికేయ సినిమా నిర్మాత శ్రీనివాస్ ఓ సినిమాను నారా రోహిత్ హీరోగా మహేష్ సూరపనేని ప్లాన్ చేసారు. కథలో రాజకుమారి అనే ఈ సినిమా ఇంకో 20శాతం టాకీ వుందనగా ఆగింది. ఇఫ్పడు ఈ సినిమా మళ్లీ సెట్ మీదకు వెళ్తోంది. 

ఈ సినిమాలో రెండు కీలకమైన పాత్రలు వున్నాయి. మరీ గెస్ట్ అప్పీయరెన్స్ లు కావు. అలా అని ఫుల్ లెంగ్త్ కావు. జస్ట్ సినిమా పరంగా కొద్ది సేపు కనిపించేపాత్రలు. ఇప్పుడు ఈ రెండింటి పాత్రలను నాగశౌర్య, ఆదాశర్మ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా సినిమాలో వారు వారి నిజ జీవిత పాత్రలు పోషిస్తున్నట్లు అంటే, సినిమాలో కూడా నాగశౌర్య, ఆదాశర్మలుగానే కనిపిస్తారన్నమాట. 

ఈ సినిమాలో రోహిత్ ఓ డిఫరెంట్ పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్రకు రెండు షేడ్స్ వుంటాయి. ఈ నెలాఖరుకు మిగిలిన ఆ ట్వెంటీ పర్సంట్ ను పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.