సాయి ధరమ్ తేజ కేరాఫ్ పవన్?

నమ్మండి..నమ్మకపొండి అని అనడానికి ఏమీ లేదు. ఇది చిరంజీవి కుటుంబానికి దగ్గరగా వుండే అభిమానులకు తెలిసిన విషయమే కాబట్టి.  Advertisement సాయిధరమ్ తేజ..తొలిసినిమా భారీగా ప్రారంభమై 20కోట్లకు పైగా ఖర్చు చేసి, తీసారు. రెండో…

నమ్మండి..నమ్మకపొండి అని అనడానికి ఏమీ లేదు. ఇది చిరంజీవి కుటుంబానికి దగ్గరగా వుండే అభిమానులకు తెలిసిన విషయమే కాబట్టి. 

సాయిధరమ్ తేజ..తొలిసినిమా భారీగా ప్రారంభమై 20కోట్లకు పైగా ఖర్చు చేసి, తీసారు. రెండో సినిమాను ఇద్దరు భారీ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, దిల్ రాజు కలిపి నిర్మిస్తున్నారు. రెండో సినిమా విడుదల కాకుండానే హరీష్ శంకర్ లాంటి దర్శకుడితో దిల్ రాజే మూడొ సినిమా నిర్మిస్తున్నారు.

ఏమిటిదంతా? అసలు సాయిధరమ్ తేజ చరిష్మాయేనా ఇదంతా? లేక అతని వెనుక మెగా ఫ్యామిలీ వుండడమే కారణమా? లేక మరింకేమైనా వుందా?  అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలిసిన విషయాలు ఇవి.

సాయిధరమ్ తేజ మెగాస్టార్ మేనల్లుడు. వారి కుటుంబసభ్యుడు. అంతవరకే..కానీ అతగాడు హీరో కావడం వెనకు కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ అన్నది అసలు సంగతి.  సా    యి ధరమ్ తేజ సినిమా వ్యవహారాలు అన్నీ నడుస్తున్నది పవన్ కళ్యాణ కనుసన్నలలో.  ఎంత వరకు అంటే పిల్లా లేని జీవితం సినిమా విడుదల కు తేదీ కూడా పవన్ ఓకె చేసాకే డిసైడ్ అయింది.

అవును నిజమే. పిల్లా నువ్వులేని జీవితం.. కొన్ని నెలల క్రితమే రెడీ అయిపోయింది. విడుదల చేద్దామంటే పవన్ ఓకె అనలేదు. తొలిసినిమా తీసిన నిర్మాతకు ఆ క్రెడిట్ ఇవ్వాలని, వెయిట్ చేయమని చెప్పుకుంటూ వచ్చాడట. ఆఖరికి ఆ సినిమా వచ్చే సూచనలు కనిపించడం లేదు…అన్నపుడు సరే ఓకె అన్నాడట.

Sai Dharam Tej Special Interview About Pilla Nuvvu Leni Jeevitham 

ఇదిలా వుంటే పిల్లా నువ్వులేని జీవితం విడుదలకు ముందు ఫ్యాన్స్ ను సమావేశ పర్చాలని హీరో అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఫ్యాన్స్ వారి వ్వవహారాలు అంటే నాగబాబే చూసేది. కానీ ఎప్పుడు చెబుతున్నా నాగబాబు ఏదో వంకతో దాటేస్తున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు సినిమా వుంది ముందు ముందు..అందుకే నాగబాబు ఇలా చేస్తున్నారా అని అభిమానుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే హైదరాబాద్ లో వదిలేసి, ఇప్పుడు సాయి ధరమ్ తేజ ఏలూరు వెళ్లి అక్కడ లోకల్ ఫ్యాన్స్ ను కలిసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. చిత్రంగా దీన్ని ఫ్యాన్సే స్వయంగా ఏర్పాటు చేయడం, వారిలో కళ్యాణ్ బాబు ఫ్యాన్సే ఎక్కువ కావడం విశేషం.

డబ్బులు ఎవరివి?

పిల్లా నువ్వు లేని జీవితం సినిమాకు అధికారికంగా ఇద్దరు నిర్మాతలు. అయితే డబ్బులు, ఆ లెక్కల అన్నీ అల్లు అరవింద్ ద్వారానే నడుస్తున్నాయి..వస్తున్నాయి. దిల్ రాజు కంపెనీ ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ లాగే పనిచేస్తోందని వినికిడి. ఇప్పడు హరీష్ శంకర్ తో చేసే మూడో సినిమాకు కూడా ఇదే విధంగా తెరవెనక ఫండింగ్ వుందని అంటున్నారు. 

Pilla Nuvvu Leni Jeevitham Theatrical Trailer

అయితే అసలు గుసగుస ఏమిటంటే, ఈ ఫండింగ్ అంతటికీ మూలం పవన్ అని వినిపిస్తోంది. ఇన్నాళ్లు సాయిధరమ్ తేజ్, తల్లి మంచి చెడ్డలు ఎక్కువగా చూసింది పవన్ అని, ఇప్పుడు ఈ కుర్రాడి భవిష్యత్ ను తీర్చిదిద్ది, స్టార్ గా నిలబెట్టే బాధ్యతను కూడా పవనే తీసుకున్నాడని తెలుస్తోంది. పిల్లా నువ్వు లేనిజీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ కథలు కూడా  పవన్ ఓకె అన్న తరువాతే తెరకెక్కాయని తెలుస్తోంది.

గతంలో నాగబాబును ఆదుకున్నది కూడా పవనే అని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మరో హీరోను తయారుచేస్తున్నది కూడా ఆయనే.

నమ్మండి నమ్మకపొండి అని చెప్పడం లేదు..అభిమానుల్లో వున్న బిగ్ స్టోరీ ఇది.