ప్రాజెక్ట్ ఉంది.. దర్శకుడు మాత్రం మారాడు..!

ఈమధ్య కాలంలో ఒకేసారి రెండు మల్టీస్టారర్ ప్రాజెక్టులు నలిగాయి. వీటిలో ఒకటి నాగ్-నాని సినిమా అయితే.. రెండోది వెంకటేష్-నాగచైతన్య సినిమా. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వెంకీ-చైతూ హీరోలుగా ఓ మల్టీస్టారర్ రాబోతోందంటూ గతంలో ప్రచారం…

ఈమధ్య కాలంలో ఒకేసారి రెండు మల్టీస్టారర్ ప్రాజెక్టులు నలిగాయి. వీటిలో ఒకటి నాగ్-నాని సినిమా అయితే.. రెండోది వెంకటేష్-నాగచైతన్య సినిమా. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వెంకీ-చైతూ హీరోలుగా ఓ మల్టీస్టారర్ రాబోతోందంటూ గతంలో ప్రచారం జరిగింది. తర్వాత ఆ ప్రాజెక్టు సైడ్ అయిపోవడం.. రవితేజ సినిమాతో కల్యాణ్ కృష్ణ బిజీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అలా ఆగిపోయిందనుకున్న సినిమా ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది.

అవును.. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా సినిమా రాబోతోంది. కాకపోతే ఈసారి తెరపైకి వచ్చిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాదు. దర్శకుడు బాబి. వెంకీ-చైతూ కాంబోను బాబి డైరక్ట్ చేయబోతున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. మరో సహ-నిర్మాత కూడా ఉండే అవకాశం ఉంది.

కల్యాణ్ కృష్ణ కథనే బాబి డైరక్ట్ చేస్తున్నాడా.. లేక మరో మల్టీస్టారర్ కథతో బాబి ఈ సినిమా తీయబోతున్నాడా అనేది తేలాల్సి ఉంది. కోన వెంకట్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే సమకూర్చబోతున్నాడు.