308 మందితో రొమాన్స్ నిజమే!

సంజయ్ దత్ బయోపిక్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి బాగా చర్చలో నిలిచిన అంశం అతడు 308 మంది అమ్మాయిలతో రొమాన్స్ చేశాడనేది. ప్రాస్టిట్యూట్స్ ను పక్కన పెట్టి చూసినా.. ఆ మాత్రం మంది ఉంటారని,…

సంజయ్ దత్ బయోపిక్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి బాగా చర్చలో నిలిచిన అంశం అతడు 308 మంది అమ్మాయిలతో రొమాన్స్ చేశాడనేది. ప్రాస్టిట్యూట్స్ ను పక్కన పెట్టి చూసినా.. ఆ మాత్రం మంది ఉంటారని, కావాలంటే 350 మంది అని రాసుకోవచ్చు అని దత్ పాత్రధారి రణ్‌బీర్ చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అది నిజమా? అనేది చర్చలో నిలిచింది. ‘సంజూ’ చూసిన తర్వాత మాత్రం అది నిజమే అని స్పష్టం అవుతుంది.

సినిమాలో దత్ తన బయోగ్రఫీని రాయించాలని అనుకుంటాడు. అందుకోసం రచయితలను సంప్రదిస్తుండగా, ఒక ప్రముఖ రచయిత్రి(అనుష్కా శర్మ)ను సంప్రదిస్తాడు. అయితే ఆమెకు దత్ బయోగ్రఫీ రాయాలనిపించదు. అందుకు అనేక కారణాలు. చివరగా రాయడానికి ముందుకు వస్తుంది. అయితే తనకు నిజాలు చెప్పాలని.. డైరెక్టుగా ఇంత వరకూ ఎంతమందితో పడుకున్నావ్? అని అడుగుతుంది.

పక్కన దత్ భార్య పాత్ర ఉంటుంది. ఆమె ముందే నిజం చెప్పాలని, నిజం చెబితే తను బయోగ్రఫీ రాస్తానని అంటుంది. అప్పుడు భార్య వైపు భయంభయంగా చూస్తూనే 308 మంది, 350 మంది అని రాసుకో… అని సంజయ్ దత్ పాత్ర చెబుతుంది. దీన్ని బట్టి.. హీరోగారు అంతమందితో రొమాన్స్ చేయడం నిజమే అని అనుకోవాల్సి వస్తుంది.