'ఏం మాయ చేశావే' సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన నాగచైతన్య- సమంతలు ఆ తర్వాత ఏడెనిమిదేళ్లకు భార్యాభర్తలయ్యారు. రెండేళ్లకు పై గా లవ్ స్టోరీని నడిపించి, పెళ్లి చేసుకున్నారు. తమ కెరీర్ ఆరంభంలో కలిసి నటించిన వీళ్లు ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో కలిసి నటించారు. భార్యాభర్తలయ్యారు. అలాగని వీరి ప్రేమకథ తాము కలిసి నటించిన తొలి సినిమా తర్వాతే ప్రారంభం కాలేదు.
సమంత ఇటీవల మాట్లాడుతూ తామిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా సమయంలోనే చైతన్యపై తను ఇంప్రెస్ అయినట్టుగా చెప్పింది. కానీ వీళ్లది లవ్ అట్ ఫస్ట్ సైట్ అయితే కాకపోవచ్చు!
ఏమాయ చేశావే తమిళ వెర్షన్ లో నటించారు శింబు-త్రిష. వీరిద్దరి గురించి రకరకాల రూమర్లు గత కొన్నాళ్లుగా షికారు చేస్తున్నాయి. ప్రత్యేకించి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ మీడియా హడావుడి చేస్తూ ఉంది. ఇప్పటికే శింబూకు ఇద్దరు హీరోయిన్లతో ప్రేమకథను నడిపించిన అనుభవం ఉంది. నయనతార, హన్సికలతో శింబూ ప్రేమకథలు నడిచాయి. అవి పెళ్లి వరకూ వెళ్లలేదు.
త్రిష ఒక పారిశ్రామికే వేత్తతో ఎంగేజ్ మెంట్ చేసుకుని, ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకుంది. వీరిద్దరూ ఏం మాయ చేశావేకు ముందు, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. టీనేజ్ లోనే వీరిద్దరూ జంటగా ఒక సినిమా చేశారు. మరి ఇప్పుడు వీళ్ల పెళ్లి అనే ఊహాగానాలు ఆసక్తిదాయకంగా మారాయి.
ఒకవేళ వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే.. గౌతమ్ మేనన్ రాసిన ప్రేమకథ పెళ్లికి తీసుకెళ్లినట్టే! ఆ సినిమా తెలుగు వెర్షన్ లో హీరోహీరోయిన్లు కలుస్తారు, పెళ్లితో సుఖాంతం అవుతుంది. తమిళ వెర్షన్ లో మాత్రం హీరోయినే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటుంది. మరి శింబూ-త్రిష ల రియల్ లైఫ్ ప్రేమకథ మాటేంటో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు