Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పోర్ట్స్ కథతో గోపీచంద్

స్పోర్ట్స్ కథతో గోపీచంద్

దర్శకుడు సంపత్ నంది-హీరో గోపీచంద్ మళ్లీ మరోసారి జట్టుకట్టారు. గతంలో ఇద్దరు కలిసి గౌతమ్ నందా అనే సినిమా చేసారు. దాని తరువాత మళ్లీ ఇధే వీళ్లిద్దరు కలవడం. యుటర్న్ అనే హిట్ సినిమా నిర్మించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తారు. ఆ బ్యానర్ కు ఇది మూడో సినిమా. 

హై బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. ప్రస్తుతం గోపీచంద్ చాణక్య సినిమా చేస్తున్నారు. అది పూర్తికావస్తోంది. అది పూర్తయిన తరువాత బోగవిల్లి ప్రసాద్ కు ఓ సినిమా చేయాల్సివుంది. అది జనవరికి కానీ పూర్తికాదు.

అది పూర్తయిన తరువాత గోపీచంద్ ఈ సినిమా మీదకు వస్తారు. గతంలో గోపీచంద్ కోసం డబుల్ రోల్ సినిమా కథ తయారుచేసిన సంపత్ నంది ఈసారి కబడ్డీ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ కథను తయారు చేసినట్లు బోగట్టా.

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?