Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీకాళహస్తిలో నితిన్

శ్రీకాళహస్తిలో నితిన్

 హీరో నితిన్ శ్రీకాళహస్తిలో ఈ రోజు హల్ చల్ చేసాడు. నిన్న తిరుపతి వెళ్లిన నితిన్ ఈరోజు విడుదలైన తన సినిమా భీష్మను శ్రీకాళహస్తి విజయలక్ష్మీ థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని చూసాడు. నితిన తో పాటు బోలెడు మంది మిత్ర బృందం వున్నారు. నిర్మాత, ఎఎమ్ఆర్ కంపెనీ అధినేత మహేష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే సోదరుడు విజయేందర్ రెడ్డి, కాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి , లోకల్ డిస్ట్రిబ్యూటర్ హరి ఇంకా అనేక మంది ఈ ప్రాంత ప్రముఖులు నితిన్ వెంట వున్నారు.

కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దగ్గర వుండి నితిన్ కు దర్శనం ఏర్పాట్లు చేసారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ ప్రముఖ పుణ్య క్షేత్రంలో తన కొత్త సినిమా చూడడం ఆనందంగా వుందని, సినిమాకు పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని అన్నారు.

ప్రస్తుతం నితిన్ రంగ్ దే, చెక్ అనే రెండు సినిమాలు దాదాపు పూర్తి చేసారు. ఇవికాక అంథాదూన్ రీమేక్ కు 24న శ్రీకారం చుడుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?