Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్టేజ్ మామూలుగా వుండదు

స్టేజ్ మామూలుగా వుండదు

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. ఇప్పటికే క్రేజ్ పీక్స్ కు చేరిపోయింది. ఆన్ లైన్ బుకింగ్ సర్రున సాగుతోంది. 

ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. ఈ ఫంక్షన్ కనుక కోవిడ్ లేకుండా ఆరు బయట జరిగి వుంటే వేరుగా వుండేది. కానీ లిమిటెడ్ ఆడియన్స్ తో పార్క్ హయాత్ లో జరగబోతోంది.

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అతిథిగా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఇక నాగార్జున, చైతన్య, సాయి పల్లవి ఎలాగూ వుంటారు. ఇలా అయిదుగురు స్టార్స్ స్టేజ్ మీద వుంటే వ్యవహారం మామూలుగా వుండదు. అయితే లిమిటెడ్ గెస్ట్ లు కాబట్టి పెద్దగా హడావుడి వుండదు.

పైగా అమీర్ ఖాన్ కు గట్టి సెక్యూరిటీ వుంది. అతని సెక్యూరిటీ జనాలే పాతికమందికి పైగా వుంటారని తెలుస్తోంది. అందువల్ల ఫంక్షన్ పాస్ ల కోసం హడావుడి ప్రారంభమైంది.  

ఇన్ సైడ్ జరిగే ఫంక్షన్ అయినా స్పాన్సర్ లను కాస్త గట్టిగా పట్టుకోవడంతో పాస్ లో సమస్య మరింత పెరిగిపోయింది. నిజానికి ఇన్ సైడ్ ఫంక్షన్ కు, అదీ ఇంత పెద్ద సినిమాకు కూడా స్పాన్సర్లు ఎందుకో? ఇదే నిర్మాతనే చేసుకుంటే ఈ పాస్ ల గోల వుండేది కాదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?