సుజిత్-బన్నీ సినిమా ఊసేలేదు

రాను రాను ఎలా తయారవుతోంది అంటే కనిపించిన ప్రతి డైరక్టర్ చేత బన్నీకి తాళి కట్టించేలా వుంది వ్యవహారం. లేటెస్ట్ గా సాహో దర్శకుడు సుజిత్ కథ చెప్పేసాడని, మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతలనీ కూడా…

రాను రాను ఎలా తయారవుతోంది అంటే కనిపించిన ప్రతి డైరక్టర్ చేత బన్నీకి తాళి కట్టించేలా వుంది వ్యవహారం. లేటెస్ట్ గా సాహో దర్శకుడు సుజిత్ కథ చెప్పేసాడని, మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతలనీ కూడా వచ్చేసింది. అయితే ఇండస్ట్రీ వర్గాల కథనం వేరుగా వుంది.

సుజిత్ ఇప్పుడు సాహో పని మీద పీకల లోతు బిజీలో వున్నాడు. కథ చెప్పేంత తీరికాలేదు, వ్యవహారమూ లేదు. రన్ రాజా రన్ హిట్ అయిన తరువాత సుజిత్ బన్నీని కలిసాడు. మళ్లీ ఇప్పటి వరకు కలవనే లేదట.
ఇదిలావుంటే మరో సింపుల్ లాజిక్ కూడా వుంది.

రన్ రాజా రన్ సినిమా అవకాశం ఇచ్చింది యువి. సాహో లాంటి వందల కోట్ల సినిమాను సుజిత్ చేతిలో పెట్టింది యువి. అలాంటిది ఇప్పుడు సుజిత్ ను అంత సులువుగా మైత్రీ మూవీస్ కు, అది కూడా సాహో సినిమా తరువాత వదిలేస్తారా?

ఈ విషయమై బన్నీ యూనిట్ జనాలను అడిగితే, కిలోమీటర్ల దూరంలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదన్నది సమాధానం. యువి యూనిట్ జనాలను అడిగితే సాహో విడుదల తరువాతే సుజిత్ ఎక్కడ చేయాలో? ఏం చేయాలో డిసైడ్ అవుతుందని, మైత్రీ-బన్నీ కాంబోలో సుజిత్ సినిమా అన్నది గాలి వార్తే అని ఆన్సర్.

మొత్తంమీద చూస్తుంటే బన్నీ త్వరగా డిసైడ్ కాకపోతే, ఇలా ఏదో ఒకటి రోజూ వినిపిస్తూనే వుంటుందేమో?

సినిమా ఆడియన్స్‌ని హడలెత్తించిన డిజాస్టర్లు! స్పెషల్ 2018 ఈవారం పేపర్

మోడీ ఎదుగుదలను RSS కట్ చేస్తోందా?